Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 25 Aug 2020 4:29 AM GMT

    Kadapa: కడప జిల్లాలొ విషాదం...

    కడప :

    - కడప జిల్లాలొ విషాదం...

    - కరోనా పాజిటీవ్ వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి రైలు కింద పడి అత్మహత్య...

    - ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఘటన ...

    - తన చావుకు ఎవరు కారణం కాదు...కరొనా వచ్చిందనే ఆత్మహత్య చేసుకుంటున్నాను...

    - కుటుంబ సభ్యులు మన్నించాలంటూ వేసుకున్న బనియన్ పై రాసుకుని అత్మహత్య

    - ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న గంగిరెడ్డి...తన పత్రాలను అదికారులు పరిశీలించాలంటూ నేలపై రాసిన గంగిరెడ్డి

  • 25 Aug 2020 4:29 AM GMT

    Narsipatnam: కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత

    తూర్పుగోదావరి

    - నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వైపు కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత

    - ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న రాజవొమ్మింగి పోలీసులు

    - మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు

  • 25 Aug 2020 4:28 AM GMT

    కర్నూలు జిలా

    - ఇటీవల తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదం తో మేల్కొన్న ఏపీ ప్రభుత్వం

    - ఈరోజు ఉదయం 11 గంటలకు కు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సేఫ్టీ కమిటీ సభ్యులతో పరిశీలించనున్న జెన్కో హైడల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు

    - కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం భద్రత స్థితి గతులను పరిశీలించి నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న కమిటీ సభ్యులు

    - సమర్పించిన నివేదిక ఆధారంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడి

  • 25 Aug 2020 4:27 AM GMT

    shankavaram: శంఖవరం మం కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్

    తూర్పుగోదావరి

    - శంఖవరం మం కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్ తీసి పరీక్షలు చేయకుండానే 12 మందికి పాజిటివ్‌

    - పరీక్షలు చేయకుండానే వైరస్‌ సోకినట్లు నివేదిక ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం

    - ఈనెల 20న ఆసుపత్రి సిబ్బందితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 50 మందికి పరీక్షలు చేశారు

    - తాజా ఫలితాలలో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

    - పాజిటివ్‌గా నిర్ధారణలో 37 మందిలో 12 మంది అసలు పరీక్షకే హాజరుకాలేదు

    - అయితే శాంపిల్స్ ఇవ్వకుండా తమపేర్లు పాజిటివ్‌గా ఎలా వచ్చాయని వారు ఆందోళన చెందుతున్నారు

    - ఆన్‌లైన్‌, ల్యాబ్‌లో సాంకేతిక లోపం కారణంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రావికంపాడు వైద్యులు చెబుతున్నారు.

    వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు

  • 25 Aug 2020 2:31 AM GMT

    Swarna Palace issue updates: స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం

    విజయవాడ

    - స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు నేడు ప్రభుత్వ సహాయం

    - మరణించిన వారి కుటుంబాలకు 50లక్షల చొప్పున చెక్కులు

    - మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ,పౌర సరఫరా ల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని)లు అందజేస్తారు

  • 25 Aug 2020 2:13 AM GMT

    RTC services update: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన

    విజయవాడ

    - తెలంగాణకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ 2.65 లక్షల కి.మీ. బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు

    - టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కి.మీ. బస్సు సర్వీసులు నడుపుతోంది

    - ఏపీఎస్‌ఆర్టీసీ కూడా లక్ష కిలోమీటర్లు తగ్గించాలని సూచించింది టీఎస్ఆర్టీసీ

    - సెప్టెంబరు 1 నుంచీ అంతర్రాష్ట్ర రవాణా ప్రారంభించాలని సూచించిన కేంద్రం

    - ఈ నెలాఖరులోగా ఏపీ, టీఎస్ ల మధ్య చర్చలు ఫలించే అవకాశం

    - పూర్తి వివరాలు 


  • 25 Aug 2020 2:11 AM GMT

    అమరావతి

    ఉదయం 11 గంటలకి క్యాంపు కార్యాలయంలో 13జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

  • 25 Aug 2020 2:10 AM GMT

    శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

    కర్నూలు జిల్లా...

    - శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద... అన్ని క్రస్ట్ గేట్లు మూసివేసిన అధికారులు

    - ఇన్ ఫ్లో : 1,24,047 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 30,986 క్యూసెక్కులు

    - పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

    - ప్రస్తుత : 884.20 అడుగులు

    - నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 210.9946 టీఎంసీలు

    కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 25 Aug 2020 2:09 AM GMT

    ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు

    అమరావతి

    - ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించిన ప్రభుత్వం

    - 25 కిలోల రైస్ తో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని ఉత్తర్వులు జారీ

    - వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కార్

Print Article
Next Story
More Stories