Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Kurnool Updates: శ్రీశైలమహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు...
    23 Nov 2020 2:53 AM GMT

    Kurnool Updates: శ్రీశైలమహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు...

      కర్నూలు జిల్లా..

    * రెండవ కార్తీక సోమవారం కావడం వేకువజామునే స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు

    * ప్రధాన ఆలయ ముందుభాగాన గంగాధర మండపం, నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తుంది భక్తులు

    * కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు

  • Anantapur Updates: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!
    23 Nov 2020 2:50 AM GMT

    Anantapur Updates: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!

      అనంతపురం:

    * తాడిపత్రి పట్టణంలో కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.

    * ఆలూరు కోన లోని శ్రీ రంగనాథ స్వామి, యాడికి మండలం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

    * కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్న ఆలయ కమిటీలు

  • Rajahmundry Updates: రాజమండ్రి- గోదావరి రేవులలో కానరాని భక్తులు...
    23 Nov 2020 2:45 AM GMT

    Rajahmundry Updates: రాజమండ్రి- గోదావరి రేవులలో కానరాని భక్తులు...

     తూర్పుగోదావరి- రాజమండ్రి

    * కార్తీక మాసం రెండో సోమవారం కూడా రాజమండ్రి- గోదావరి రేవులలో కానరాని భక్తులు,,?

    * కోవిడ్-19వల్ల గోదావరి స్నానఘట్టాలలోస్నానాలు ఆచరించొద్దని అధికారులు నిషేధాజ్ఞలు

    * వెలవెల బోతున్న స్నాన ఘట్టాలు

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
    23 Nov 2020 2:38 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

      తిరుమల సమాచారం

    *నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,640 మంది భక్తులు.

    *నిన్న తలనీలాలు సమర్పించిన 10,946 భక్తులు.

    *నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.26 కోట్లు.

  • Anantapur Updates: పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి జయంతి..
    23 Nov 2020 2:36 AM GMT

    Anantapur Updates: పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి జయంతి..

      అనంతపురం:

    * ప్రపంచం ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి జయంతి.

    * కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఆంక్షలు.

    * ఆన్లైన్లోనే సత్యసాయి మహా సమాధి దర్శనం.

  • Kurnool Updates: నాలుగవ రోజు కొనసాగుతున్న తుంగ భద్ర పుష్కరాలు..
    23 Nov 2020 2:33 AM GMT

    Kurnool Updates: నాలుగవ రోజు కొనసాగుతున్న తుంగ భద్ర పుష్కరాలు..

      కర్నూల్..

    -కార్తీకమాసం సోమవారం కావడంతో అధిక సంఖ్యలో ఘాట్ల కు తరలివస్తున్న భక్తులు

    -పిండప్రదానాలు, ప్రత్యేక పూజలు ,గంగమ్మ హారతి లో పాల్గొంటున్న భక్తులు

    -పుణ్యస్నానాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన షవర్ కింద స్నానం

    -తుంగభద్రలో కార్తీకదీపాలను వదిలి మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు

    -పలువురు ఘాట్ లలో సంప్రోక్షణ చేసుకోడానికి కూడా భక్తులకు అందని తుంగభద్రమ్మ

    -కేవలం షవర్ నీటి తోనే సరి పెట్టుకోవాలని సెలవిస్తున్నా అధికారులు..

  • Kurnool Updates: కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కల కలలాడుతున్నాయి..
    23 Nov 2020 2:23 AM GMT

    Kurnool Updates: కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కల కలలాడుతున్నాయి..

      కర్నూల్

    * శ్రీశైలం, మహానంది, యాగంటి ,ఓంకారం, కాల్వబుగ్గ, రుద్రకోడూరు ,మంత్రాలయం ఆలయాల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

    * పుణ్య స్నానాలకు ఆలయాల లో ఉన్న కోనేర్ల లో అనుమతి లేకపోవడంతో ఇంటివద్దనే స్నానాలు ఆచరించి స్వామి అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న        భక్తులు

    * కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ అధికారులు

    * గర్భాలయ ప్రవేశం ,స్పర్శ దర్శనాలు నిలిపివేత

    * భౌతిక దూరం పాటిస్తూ సామూహిక అభిషేకాలు, హోమాలు, స్వామివారి కల్యాణం నిర్వహణ

    * గౌరీ నోములు, కేదారేశ్వర నోము లకు సంబంధించి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

    * వేకువజాము నుండే కార్తీక దీపం వెలిగించి స్వామి,అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు

Print Article
Next Story
More Stories