Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 23 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం పంచమి: (రా. 9-32 వరకు) తదుపరి షష్టి, చిత్త: (రా. 10-15 వరకు) తదుపరి స్వాతి, అమృత ఘడియలు: (సా. 4-18 నుంచి 5-47 వరకు) వర్జ్యం: (ఉ. 7-22 నుంచి 8-51 వరకు తిరిగి తె. 3-27 నుంచి 4-57 వరకు) దుర్ముహూర్తం: (సా. 4-38 నుంచి 5-28 వరకు) రాహుకాలం: (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-19

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 23 Aug 2020 4:33 AM GMT

    Gadwal: ఉప సర్పంచ్ నర్సమ్మను సస్పెండ్ చేసిన కలెక్టర్ శృతి ఓజా..

    జోగులాంబ గద్వాల జిల్లా:

    - మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామ ఉప సర్పంచ్ నర్సమ్మను సస్పెండ్ చేసిన కలెక్టర్ శృతి ఓజా...

    - చెక్కులపై సంతకాలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఉప సర్పంచ్ నర్సమ్మ.

    - సర్పంచ్ రాధనీల ఫిర్యదు మేరకు విచారణ జరుపి ఉప సర్పంచ్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్.

  • 23 Aug 2020 3:01 AM GMT

    Sangareddy: గుమ్మడిదల మండలం దోమడుగు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.

    సంగారెడ్డి:

    గుమ్మడిదల మండలం దోమడుగు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.

    - వోరా పెట్రో కెమికల్స్ గోదాంలో చెలరేగిన మంటలు,దట్టంగా అలముకున్న పొగలు

    - వందల డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సాల్వెంట్స్ అంటుకోవడంతో పేలుడు శబ్దం,భయాందోళనకు గురైన స్థానికులు

    -సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఐదు ఫైర్ ఇంజన్లు,

    - గోదాంలో నుంచి ఇంకా వెలువడుతున్న పొగలు

    - రికవరి సాల్వెంట్ పేరుతో దందా చేస్తున్న కల్పేష్, హరీష్

    - ఫైర్ సేఫ్టీ లేకుండా మూడు సంవత్సరాలుగా అక్రమంగా దందా

    - ప్రమాదంలో రెండు లారీలు దగ్థం, బూడిదైన గోదాం

  • 23 Aug 2020 2:52 AM GMT

    Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 95.10 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 4.726 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 4,07,120 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 4,07,120 క్యూసెక్కులు

  • 23 Aug 2020 2:51 AM GMT

    Saraswathi Barrage: సరస్వతి బ్యారేజ్ 19 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - సరస్వతి బ్యారేజ్ 19 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 116.100 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 5.25 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 63,000 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 63,000 క్యూసెక్కులు

Print Article
Next Story
More Stories