Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 22 Sep 2020 12:19 PM GMT

    Jayashankar Bhupalpally: లక్ష్మీ బ్యారేజ్- 46 గేట్లు ఎత్తిన అధికారులు..

     జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    - పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు

    - ఇన్ ఫ్లో 2,85,500 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో 3,28,100 క్యూసెక్కులు

  • 22 Sep 2020 12:07 PM GMT

    National updates: భవిష్యత్ కార్యాచరణ పై చర్చించేందుకు సమావేశం అయిన విపక్ష పార్టీలు..

    జాతీయం..

    -రాజ్యసభ లో 8 మంది ఎంపిల సస్పెన్షన్ కు సంఘీభావంగా ఒక రోజు పాటు లోక్ సభ కార్యక్రమాలను బహిష్కరించిన శివసేన, టీఆర్ఎస్ , బీఎస్పీ పార్టీలు.

    -లోక్ సభ కార్యక్రమాలను ఈ సెషన్ పూర్తి అయ్యే వరకు బహిష్కరించిన కాంగ్రెస్

    -వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంటే లోక్ సభ కు హాజరయ్యే విషయం పై పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన.

  • 22 Sep 2020 11:51 AM GMT

    Nalgonda updates: ప్రముఖ న్యాయవాది బంటు బుచ్చిబాబు ని ఆరెస్ట్ చేసి పిడి యాక్ట్ చేసిన జిల్లా పోలీసులు....

    నల్గొండ :

    -న్యాయవాది వృత్తిలో ఉంటూ....బెదిరింపులు కబ్జాలతో పాటు 220 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమణ, బలవంతపు వసూళ్లపై బుచ్చిబాబు పై పెద్ద ఎత్తున   పిర్యాదు లు....

    -మిర్యాలగూడ టౌన్, రూరల్ పిఎస్ ,దామరచర్లలో కేసులు, బుచ్చిబాబు కు సహకరించిన కొడుకు మహేష్ బామ్మర్ధి పాపయ్య పై కేసు నమోదు...

  • Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-35 గేట్లు ఎత్తిన అధికారులు..
    22 Sep 2020 11:29 AM GMT

    Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-35 గేట్లు ఎత్తిన అధికారులు..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    - పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,75,000 క్యూసెక్కులు

  • 22 Sep 2020 11:25 AM GMT

    Hyderabad updates: 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బండి సంజయ్..

    బండి సంజయ్..

    - ఒక్కో జిల్లాకు ఒక్కో అధ్యక్షుల నియామకం.

    - రంగారెడ్డి అర్బన్... సామారంగరెడ్డి.

    - మేడ్చల్ అర్బన్... పండాల హరీష్ రెడ్డి.

    - గోల్కొండ గోశామహల్.. పాండు యాదవ్.

    - భాగ్యనగర్ మాలక్పేట్... సంరెడ్డి సురేందర్ రెడ్డి.

    - మహంకాళి సికింద్రాబాద్... సాంసుందర్ గౌడ్.

    - బర్కత్ పుర అంబర్ పెట్... గౌతమ్ రావ్.

    - మేడ్చల్ రూరల్... విక్రంరెడ్డి.

    - కామారెడ్డి... అరుణతారా.

    - జగిత్యాల్... మొరపల్లి సత్యనారాయణ.

    - ఖమ్మం....గల్లా సత్యనారాయణ.

    - సూర్యాపేట.. బోబ్బా భాగ్యరెడ్డి.

    - వికారాబాద్.. సదానంద రెడ్డి.

  • 22 Sep 2020 11:19 AM GMT

    Telangana updates: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై..

    ఎక్సైజ్‌శాఖ..

    -గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి

    -12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు

    -టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ

    -ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు

    -ఖండాంతరాలు దాటిన హైదరాబాద్‌ డ్రగ్స్‌ దందా

    -జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై

    -విదేశాలనుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ

    -www.ipsld.lo వెబ్‌సైట్‌ ద్వారా స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ బుకింగ్‌

    -సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్‌

    -ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు

    -సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో 72 మంది పేర్లు

    -విచారణకు హాజరైన 12 మందితో మరో 60మంది జాబితా

  • 22 Sep 2020 11:07 AM GMT

    Hyderabad updates: ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు..

    హైదరాబాద్ :

    - అక్రమ కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు

    - మెదక్ జిల్లా , పెద్ద శంకరం పేట మండలం , చీలపల్లి గ్రామం మధ్యలో నిర్మిస్తున్న స్మశాన వాటికను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు.

    - హైకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ... స్థానిక అధికారపార్టీ సర్పంచ్ , ఎంపీటీసీల ప్రోద్భలంతో పెద్ద శంకర్ పేట పీఎస్ ఎసై సత్యనారాయణ         తమ పై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కమిషన్ కు వివరించిన గ్రామస్తులు.

    - తమను వేధిస్తున్న ఎసై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ ను వేడుకున్న చీలపల్లి గ్రామస్తులు.

  • 22 Sep 2020 11:04 AM GMT

    Vanasthalipuram updates: ప్రేమ పేరుతో నయవంచన...

    వనస్థలిపురం..

    - వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నయవంచన ఘటన...

    - వనస్థలిపురం హస్తిన పురం కి చెందిన ఆకురి గీత (23) హస్తిన పురం లో VSR ధాన్యం గోదాం పనిచేస్తున్న క్రమంలో సున్నం విష్ణు (25) తో పరిచయం      ఏర్పడింది..

    - రెండు సంవత్సరాలుగా ఇద్దరు పార్కులు, సినిమాలు తిరిగాము అని తెలిపిన గీత.

    - పెళ్లి చేసుకొమ్మని అడిగితే కులం తక్కువ దానివి అని పెళ్లికి నిరాకరించిన విష్ణు..

    - తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన గీత. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

  • 22 Sep 2020 11:00 AM GMT

    Nizamabad updates: జక్రాన్ పల్లి లో చైన్ స్నాచింగ్..

    నిజామాబాద్ :

    - ముసుగు ధరించి మహిళ మెడ పై కత్తి పెట్టి చితక బాధి 2తులాల బంగారు గొలుసు, సెల్ ఫోన్ లాక్కు వెళ్లిన ఇద్దరు దుండగులు.

    - పంట పొలం లో పని చేస్తున్న మహిళ ను టార్గెట్ చేసిన దుండగులు.

    - ముసుగు దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు.

  • 22 Sep 2020 10:52 AM GMT

    National updates: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది..

    జాతీయం..

    ఢిల్లీ:

    (వెంకటేష్ నేత, టి.ఆర్.ఎస్, ఎంపీ)

    • ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చేత శభాష్ అనిపించుకున్న ఘనత సీఎం కేసీఆర్ ది..

    • బిజెపి ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గు చేటు.

    • పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ హుందాగా వ్యవహరించాలి.

    • ధర్మపురి అరవింద్.. జీవితం జీరో.

    • “కరోనా” నియంత్రణకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 290 కోట్లు మాత్రమే.

    •ఇలా సభ్యత లేకుండా మాట్లాడమని బిజేపి ఎంపీలకు ప్రధాని మోడి చెప్పారా..?

    • టిఆర్ఎస్ పార్టీ నేతలకు సభ్యత, సంస్కారం ఉంటుంది.

    • వ్యవసాయ బిల్లులు యుద్ధ వాతావరణంలో ఆమోదం చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

    • మేము ప్రజాస్వామ్య బద్దంగా రెవెన్యూ బిల్లును ఆమోదించినం.

    • వీగిపోతుందని తెలిసే మూజువాణి ఓటుతో మీరు వ్యవసాయ బిల్లులు ఆమోదింపజేసుకున్నారు.

    • అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీల చర్చ తరువాతే రెవెన్యూ బిల్లు ఆమోదం పొందింది. రైతులు సంబరాలు చేసుకున్నారు.

Print Article
Next Story
More Stories