Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 22 Oct 2020 8:44 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

విషాదం: తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాయిని కన్నుమూత. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వర్తించిన నాయిని. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితుడు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి. బుల్లెట్ నర్సన్నగా ప్రసిద్ధి. 1944 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మం. నేరేడుగొమ్ము

Live Updates

  • 22 Oct 2020 10:21 AM IST

    నల్గొండ

    మాజీ హోం మంత్రి ,టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహ్మ రెడ్డి అకలా మృతితో స్వగ్రామం లో విషాదం...

    నల్గొండ జిల్లా నేమరుగొమ్ముల లో విషాద చాయలు..

    సొంత గ్రామాన్ని మండలం గా చేయడం లో నాయిని కృషి

    గ్రామాభివృద్ధికి కృషి చేసిన నాయిని నర్సింహ్మ రెడ్డి...

  • 22 Oct 2020 8:02 AM IST

  • Nayani Narasimhareddy Death: నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి సంతాపం
    22 Oct 2020 7:59 AM IST

    Nayani Narasimhareddy Death: నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి సంతాపం

    - నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మికలోకానికి తీరనిలోటు . మాజీమంత్రిగా , పలుదపాలు శాసన సభ్యులు గా మండలిసబ్యులుగా , కార్మిలోకానికి యెనలేని సేవలు చేసిన నాయిని ఇకలేడని చెప్పడానికి విచారిస్తున్నాను...

    - జీవిత చివరకంలో కొంత రాజకీయ అసంత్రుప్తి వారినివెంటాడింది...

    - అయినా నిబద్దతగానే జీవితం ముగించారు..

    - వారిమరణం పట్ల ప్రఘాడసంతాపం తెలియజేస్తూ వారికుటుంబసబ్యులకు, కార్మికలోకానికి సానుభూతి తెలియజేస్తున్నాను..

  • 22 Oct 2020 7:56 AM IST


  • 22 Oct 2020 7:55 AM IST


  • Nayani Narasimha Reddy: నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రులు..
    22 Oct 2020 7:34 AM IST

    Nayani Narasimha Reddy: నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రులు..

    - శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి

    - తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తో పాటు ఎనలేని కృషి చేసిన వ్యక్తి నాయిని..

    - తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పెద్ద దిక్కు లాగా నాయిని ఉండేవాడు..

    - కరోనా రావడం ఆ తర్వాత నిమోనియా తో కోమాలోకి వెళ్లడం వలన నాయిని కోల్పోయాము..

    - హోంమంత్రి గా కార్మిక శాఖ మంత్రిగా నాయిని ఎనలేని సేవలు అందించారు..

    - నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

  • Nayani Narasimhareddy : మినిస్టర్ క్వార్టర్స్ కు నాయిని పార్థివ దేహం
    22 Oct 2020 7:29 AM IST

    Nayani Narasimhareddy : మినిస్టర్ క్వార్టర్స్ కు నాయిని పార్థివ దేహం

    - జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుండి మినిస్టర్ క్వాటర్స్ నాయిని పార్థివ దేహం తరలించిన కుటుంబ సభ్యులు..

    - ఈరోజు మధ్యాంహ్నం వరకు పార్టీ శ్రేణుల సందర్శనార్థం మినిస్టర్ క్వాటర్స్ లో ఉంచనున్న కుటుంబ సభ్యులు..

    - సాయంత్రం మహాప్రస్థానం లో అంతక్రియలు.

K V D Varma

K V D Varma

Next Story