Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా లోకేష్..
    19 Oct 2020 3:41 PM GMT

    Amaravati updates: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా లోకేష్..

    అమరావతి..

    -రేపు కృష్ణా జిల్లా కైకలూరు,పశ్చిమగోదావరి జిల్లా ఉండి,తణుకు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి   నారా లోకేష్

    -దెబ్బతిన్న పంటలు,నీట మునిగిన ఇళ్ళు పరిశీలించి నష్టపోయిన రైతులు,ప్రజల్ని పరామర్శించనున్న లోకేష్

  • 19 Oct 2020 3:37 PM GMT

    Maharashtra updates: ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు మావోల వివరాలు వెల్లడించిన పోలీసులు..

    మహారాష్ట్ర:

    -గడ్చురోలి జిల్లా దానోర తాలూకా గ్యారపత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసమి కేసానిలి అడవి ప్రాతంలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన   ఐదుగురు మావోల వివరాలు వెల్లడించిన పోలీసులు

    -ఈ సంవత్సరం లో 10 మంది మావోలను మట్టుపెట్టడం జరిగింది అన్నారు.

    -ఈ సంవత్సరంలో ఇదే పెద్ద సంఘటన అనిఅన్నారు.

    -ఈ కుంబింగ్ లో పాల్గొన్న సి60 కమోడోస్ అభినందించిన గడ్చురోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్

    -1)సుమిత &రాజో,వయసు 34 గ్రామం: ముంగనిర్,

    -తాలూకా దానోర,

    -ఈమె మీద 14 కేసులు

    -4 లక్షలు రివార్డు

    -2)కుమిలి దావీడే, వయసు23, గ్రామం: కటజీరి

    -తాలూకా: దానోర

    -కోర్చి దళం సభ్యురాలు

    -2 కేసులు

    -రివార్డు 2 లక్షలు

    -3)సుమన్ &జుంకి &సుంకి వయసు32

    -గ్రామము:పిసిలి బొరిగి,

    -తాలూకా :ఏటపల్లి,

    -జిల్లా:గడ్చురోలి

    -తిపగడ్ దళం acm సభ్యురాలు,2006 నుండి పని చేస్తుంది,

    -21 కేసులు,6 లక్షల రివార్డు

    -4)చందా&చందన&మాకే వయసు26

    -గ్రామం: బుడిగిన్:

    -తాలూకా :జోగర్ గుండా

    -జిల్లా బీజాపూర్

    -రాష్ట్రం; ఛత్తీస్ గడ్

    -15 నెంబర్ ప్లాటున్ దళ సభ్యురాలు,4 లక్షలు రివార్డు

    -5)టిరా &నిలిష్&శివాజీ వయసు30

    -గ్రామం: కిచోడ,

    -తాలూకా :దానోర

    -జిల్లా:గడ్చురోలి

    -తిప్పగాడ్ దళ సభ్యుడు,20 కేసులు,2లక్షల రివార్డు

    -చనిపోయినా మావోల మీద 16 లక్షల రివార్డు ఉంది

  • Srikakulam updates: బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుంది...
    19 Oct 2020 3:23 PM GMT

    Srikakulam updates: బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుంది...

    శ్రీకాకుళం..

    -అచ్చెన్నాయుడు, టిడిపి ఎపి అద్యక్షుడు..

    -పార్టీ ఓడినా గెలిచినా...ఓడినా ఎప్పుడూ టిడిపితో ఉండేది బిసిలే!

    -టిడిపి నియామకాల్లో 60 శాతం బిసిలకే ఇచ్చారు

    -2024లో ఎన్నికలుజరిగినా...ముందు జరిగినా చంద్రబాబును సిఎం ను చేస్తాం

    -రాష్ట్రం కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావాలి

    -16 నెలల్లో రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యం, కక్ష సాదింపు చర్యలే

    -వైసిపి పాలన కారణంగా టిడిపి క్యాడర్ భయంలోకి వెళ్లిపోయారు

    -పార్టీలో అందరినీ కలుపుకుంటా....ప్రజా క్షేత్రంలో పారాడుతా

  • Peddireddy Ramchandra Reddy: ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం..
    19 Oct 2020 3:12 PM GMT

    Peddireddy Ramchandra Reddy: ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం..

    -వరదలపై మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష.......

    -ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం

    -హైదరబాద్ లో నాళాలు పై నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు పడుతున్నారు

    -బలహీనంగా ఉన్న కాలువలు, చెరువులు గుర్తించి పనులు చేపడుతాం

    -ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు

    -అవసరమైన నిధులు సమకూర్చి నష్ట పరిహారం చెల్లిస్తాం

  • Amaravati updates: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు..
    19 Oct 2020 2:46 PM GMT

    Amaravati updates: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు..

    అమరావతి :

    -2018 గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ అంశంపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ..

    -‌అక్టోబర్ 22 లోపులో తీర్పు వెలువరించనున్న ధర్మాసనం..

  • Visakha updates: గత పాలకులు బీసీలను మోసం చేశారు!
    19 Oct 2020 1:29 PM GMT

    Visakha updates: గత పాలకులు బీసీలను మోసం చేశారు!

    విశాఖ..

    -ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్

    -భారతదేశంలోనే బీసిలకు పెద్దపీట వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి.

    -కలలో కూడా ఊహించని విధంగా ముఖ్యమంత్రి బీసిలకు న్యాయం చేశారు.

    -తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కులులాగా మెరుగుతున్నారు.

    -టిడిపిలో కుక్కులాగ ఉండలేకే వైసిపీ పార్టీకి మద్ధతు ఇచ్చాను.

  • Visakha updates: రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు!
    19 Oct 2020 1:18 PM GMT

    Visakha updates: రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు!

    విశాఖ..

    -విశాఖ బీచ్ రోడ్డులో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు

    -హాజరైన ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్,అదీప్ రాజు,వాసుపల్లి గణేష్ కుమార్ ,వైసిపీ నాయకులు

  • Srikakulam updates: సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ!
    19 Oct 2020 1:11 PM GMT

    Srikakulam updates: సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ!

    శ్రీకాకుళం జిల్లా..

    -మందస మండలం రట్టి తీరంలో మృతదేహం లభ్యం..

    -మృతుడు సిసింద్రీగా గుర్తింపు..

    -నిన్న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ..

    -24 గంటలుగా సిసింద్రీ కోసం కొనసాగిన గాలింపు చర్యలు..

    -సిసింద్రీ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..

  • 19 Oct 2020 1:07 PM GMT

    East godavari updates: నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..

    తూర్పుగోదావరి :

    -పెదపూడి మం. అచ్చుతాపురత్రయం లో నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..

    -వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను బ్యాక్ అంటూ నినాదాలతో ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు..

    -పోలీసుల జోక్యంతో వెనుదిరిగిన వైసిపి కార్యకర్తలు.. సద్దుమణిగిన వివాదం..

  • Weather updates: రాయలసీమలో మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది..
    19 Oct 2020 12:05 PM GMT

    Weather updates: రాయలసీమలో మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

     రాయలసీమ :

    -ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో భారీ   వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    -రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు   అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    -ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

    -అమరావతి వాతావరణ కేంద్రము

Print Article
Next Story
More Stories