Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తాజా వార్తలు
Show Full Article

Live Updates

  • Amaravati Updates: మరింత ముదురుతున్న ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వ్యవహారం...
    18 Nov 2020 4:26 AM GMT

    Amaravati Updates: మరింత ముదురుతున్న ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వ్యవహారం...

      అమరావతి...

    * సీఎస్ లేఖతో ఎస్ఈసీ నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్సు నిర్వహాణపై సందిగ్దత.

    * ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. సీఎస్ లేఖతో వీడియో కాన్ఫరెన్సుకు అధికారులు హాజరయ్యే అవకాశం లేదంటున్న ప్రభుత్వ వర్గాలు.

    * వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఇప్పటికే ఎస్ఈసి కి లేఖ రాసిన సియస్ నీలం సాహ్ని.

    * వీడియో కాన్ఫరెన్స్ నిర్వహాణపై మరిన్ని సంప్రదింపులకు సిద్దమని సీఎస్ స్పష్టీకరణతో ఆసక్తిగా మారిన వ్యవహరం.

    * ప్రభుత్వం తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ.

  • Krishna District updates: శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పుష్ప అలంకరణ..
    18 Nov 2020 4:24 AM GMT

    Krishna District updates: శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పుష్ప అలంకరణ..

      కృష్ణాజిల్లా

    - నాగులచవితి పర్వదినం సందర్భంగా జనసంద్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం

    - రాష్ట్ర నలుమూలల మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు ..

    - స్వామివారికి పంచామృత అభిషేకాలు పంచహారతులు ఘనంగా నిర్వహించిన ఆలయ వేదపండితులు

    - ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు స్వామివారి కి తొలి పూజ చేసి నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నా రాష్ట్ర వ్యవసాయ     శాఖఉపాధ్యక్షులు MVS నాగిరెడ్డి దంపతులు.. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు....

  • Kurnool District Updates: పగిడ్యాల మండలం ప్రాతకోటలో ఉద్రిక్తత...
    18 Nov 2020 4:15 AM GMT

    Kurnool District Updates: పగిడ్యాల మండలం ప్రాతకోటలో ఉద్రిక్తత...

       కర్నూలు...

    - వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి సిధార్థ రెడ్డి , ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల మధ్య ఘర్షణ

    - నీళ్ల ట్యాంక్ లో మూత్ర విసర్జన చేశాడని సిద్దార్థ రెడ్డి వర్గానికి చెందిన యువకులపై దాడి చేసిన ఎమ్మెల్యే వర్గీయులు...

    - పాతకక్షలు మనసులో పెట్టుకొనే కొట్టారని పోలీసులకు పిర్యాదు చేసిన సిద్దార్థరెడ్డి వర్గీయులు..

    - ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు

  • Amaravati Updates: పోలవరం ఎత్తును కూడా తగ్గించే వాడని ప్రస్తుత కలవరింతలకు అర్థం...
    18 Nov 2020 3:55 AM GMT

    Amaravati Updates: పోలవరం ఎత్తును కూడా తగ్గించే వాడని ప్రస్తుత కలవరింతలకు అర్థం...

      అమరావతి....

    - ట్విటర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    - తగ్గించడం అంటే...జెన్కో థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్ కరెంటు కొనుగోళ్లకు వేల కోట్లు దోచిపెట్టిడం.

    - పంట రుణాలు టోటల్ గా మాఫీ చేస్తానని గెల్చి ‘ఛా...నేనలా అనలేద’ని పరిమితిని తగ్గించి మోసం చేయడం.

  • Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
    18 Nov 2020 3:49 AM GMT

    Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

      విజయవాడ..

      రామకృష్ణ.

    - నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశాయి.

    - రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయండి.

    - రు.450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్ళించారు.

    - గత 18 నెలలుగా ఇసుక కొరత, కరోనాల వల్ల పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు.

    - దిక్కుతోచని స్థితిలో కార్మికులు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమయ్యారు.

    - సంక్షేమ బోర్డు నిధులను వినియోగించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి.

  • Anantapur District Updates: జిల్లా లో 11 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ...
    18 Nov 2020 3:45 AM GMT

    Anantapur District Updates: జిల్లా లో 11 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ...

      అనంతపురం:

    * నాడు నేడు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు గుర్తించిన ప్రోగ్రెస్ మానిటరింగ్ యూనిట్ బృందం.

    * పనుల్లో లోపాలు, ఆర్థిక తప్పిదాలు గుర్తింపు. స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడం వంటివి బాధ్యతారహితంగా భావించిన ప్రభుత్వం.

    * జిల్లాలో 11,255 పాఠశాలల్లో రూ.330.56 కోట్ల అంచనాతో నాడు నేడు పనులు

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
    18 Nov 2020 3:40 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

    తిరుమల సమాచారం

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 29,608 మంది భక్తులు.

    - తలనీలాలు సమర్పించిన 10,137 భక్తులు.

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు.

    - నాగులచవితి సందర్భంగా ఇవాళ సాయంత్రం పెద్దశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి

  • Anantapur Updates: నేటి నుంచి పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు....
    18 Nov 2020 3:37 AM GMT

    Anantapur Updates: నేటి నుంచి పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు....

      అనంతపురం:

    - నేటి నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు

    - కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ట్రస్టు వర్గాలు.

    - ఇవాళ వేణుగోపాల స్వామి రథోత్సవం, సాయి కుల్వంత్ హాలు లో సత్యసాయి మహా సమాధి వద్ద సాయి భక్తి గీతాలతో వేడుకలు ప్రారంభం.

    - సీతారామ స్వామి కళ్యాణంతో పాటు సాయి సత్యనారాయణ వ్రతం చేపట్టనున్న ట్రస్ట్

    - పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి తరలివచ్చిన దేశ, విదేశీ భక్తులు

  • Amaravati Updates: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సియస్ నీలం సాహ్ని లేఖ...
    18 Nov 2020 3:32 AM GMT

    Amaravati Updates: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సియస్ నీలం సాహ్ని లేఖ...

     అమరావతి..

    - ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సియస్ నీలం సాహ్ని లేఖ.

    - రాష్ట్రంలో ఉన్న కరోన కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేసిన సియస్.

    - లేఖలో సియస్ నీలం సాహ్ని:

    - కరోన కట్టడికి రాష్ట్రాలు వివిధ వ్యూహాలు రచించాయి.

    - ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ని అంచనా వేయడం సరికాదు.

    - చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది.

    - ఇప్పటికే రాష్ట్రంలో 6890 మంది కరోనాకు బలయ్యారు.

    - మరోసారి కరోన ప్రబలేలా చర్యలు తీసుకునేందుకు మేము ముందుకు వెళ్లలేము.

    - ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు కరోన వ్యాపించడం ప్రాణాంతకం.

    - ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది,వివిధ శాఖలు, కరోన కట్టడికి కృషి చేస్తున్నారు.

    - స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తాం

    - రాష్ట్ర ప్రజల ఆరోగ్యం,భద్రత దృష్ట్యా ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం సరైన నిర్ణయం కాదు.

    - దయచేసి ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చెయ్యాలి.

    - నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకువచ్చారు

    - ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని మేము భావిస్తున్నాం.

Print Article
Next Story
More Stories