Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Aug 2020 9:42 AM IST
కామారెడ్డి జిల్లా:
- నాగిరెడ్డిపేట్ మండలం గోలి లింగాల గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను ట్రాక్టర్ డ్రోసర్ ద్వారా తొలగించిన వ్యక్తికి 5 వేల రూపాయల జరిమానా విధించిన అధికారులు
- 13 Aug 2020 9:40 AM IST
సంగారెడ్డి జిల్లా:
- నారాయణఖేడ్ పట్టణం లో కారోన వ్యాధి సోకి హోమ్ క్యారెంటన్ లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
- 13 Aug 2020 9:38 AM IST
పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమేపీ పెరుగుతున్న వరద ఉధృతి
- పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి
- గత రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది
- ప్రస్తుతం గోదావరి నీటి మట్టం8.8 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది
- ఈ సీజన్ లో గోదావరి ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి
- 13 Aug 2020 8:52 AM IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భారీ వర్షం
- జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షం
- గణపసముద్రంలో 24 అడుగులకు చేరిన నీటి మట్టం
- నాలుగో రోజు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి .
- మొత్తం 23 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- సుమారుగా 3 కోట్ల50లక్షల నష్టం
- 13 Aug 2020 8:51 AM IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.
నల్గొండ :.
- పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం : 563.10 అడుగులు.
- ఇన్ ఫ్లో :38,140 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో : 8422 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 239.6552 టీఎంసీలు.
- 13 Aug 2020 8:48 AM IST
జనగామ జిల్లా: నర్మెట్ట మండలంలో రెవిన్యూ అధికారుల అవినీతి లీలలు...
- ఎమ్మార్వో లాగిన్ తో ప్రభుత్వ భూమి 40 ఎకరాలను ఎక్కించుకున్న ఘనుడు..
- మాచ్చుపహాడ్ రెవిన్యూ గ్రామంలోని 215 సర్వే నెంబర్లో 40 ఎకరాల భూమి స్వాహా..ఖాళీగా ఉందని..కబ్జాకు ప్రయత్నం..
.- కబ్జా కోరుకు..రెవిన్యూ అధికారుల అండదండలు.. పహాని మార్చిన లఘుపతి...
- గత కొద్దికాలంగా..నర్మెట్ట మండల రెవిన్యూ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి లీలలు.. బ్రోకర్లను పెట్టుకొని దందా నడిపిస్తున్న వైనం..
- డబ్బులు ఇస్తే క్షణాల్లో రికార్డు..మాయం.. రెవిన్యూ అధికారుల అవినీతి లీలాలపై దృష్టి సరించని ఉన్నత అధికారులు..
- బాధితులు నిన్ననే కలెక్టర్ కి ఫిర్యాదు.. నామమాత్రంగా స్పందించిన కలెక్టర్.. బాధితులు నర్మెట్ట రెవిన్యూ కార్యాలయం ముందు ఆందోళన.. బిజెపి, mrps శ్రేణుల మద్దతు..
- సమాధానం చెప్పలేక పోతు.., కుర్చీ నుండి బయటకి వెళ్లిపోయిన ఎమ్మార్వో....
- ఎమ్మార్వో హస్తం ఉందంటూ బాధిత గిరిజనులు ఆవేదన..
- 13 Aug 2020 8:25 AM IST
నిజామాబాద్ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద ఉధృతి.
- ఇన్ ఫ్లో 23,522వేల క్యూసెక్యులు
- ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం.1075.40అడుగులు.
- 40.952 టీఎంసీలు
- పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు,
- 90 టీఎంసిలు.




