Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Aug 2020 4:12 AM GMT

    కామారెడ్డి జిల్లా:

    - నాగిరెడ్డిపేట్ మండలం గోలి లింగాల గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను ట్రాక్టర్ డ్రోసర్ ద్వారా తొలగించిన వ్యక్తికి 5 వేల రూపాయల జరిమానా విధించిన అధికారులు

  • 13 Aug 2020 4:10 AM GMT

    సంగారెడ్డి జిల్లా:

    - నారాయణఖేడ్ పట్టణం లో కారోన వ్యాధి సోకి హోమ్ క్యారెంటన్ లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  • 13 Aug 2020 4:08 AM GMT

    పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమేపీ పెరుగుతున్న వరద ఉధృతి

    - పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి

    - గత రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది

    - ప్రస్తుతం గోదావరి నీటి మట్టం8.8 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది

    - ఈ సీజన్ లో గోదావరి ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి

  • 13 Aug 2020 3:22 AM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భారీ వర్షం

    - జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షం

    - గణపసముద్రంలో 24 అడుగులకు చేరిన నీటి మట్టం

    - నాలుగో రోజు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి .

    - మొత్తం 23 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

    - సుమారుగా 3 కోట్ల50లక్షల నష్టం

  • 13 Aug 2020 3:21 AM GMT

    నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

    నల్గొండ :.

    - పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

    - ప్రస్తుత నీటిమట్టం : 563.10 అడుగులు.

    - ఇన్ ఫ్లో :38,140 క్యూసెక్కులు.

    - అవుట్ ఫ్లో : 8422 క్యూసెక్కులు.

    - పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

    - ప్రస్తుత నీటి నిల్వ : 239.6552 టీఎంసీలు.

  • జనగామ జిల్లా: నర్మెట్ట మండలంలో రెవిన్యూ అధికారుల అవినీతి లీలలు...
    13 Aug 2020 3:18 AM GMT

    జనగామ జిల్లా: నర్మెట్ట మండలంలో రెవిన్యూ అధికారుల అవినీతి లీలలు...

    - ఎమ్మార్వో లాగిన్ తో ప్రభుత్వ భూమి 40 ఎకరాలను ఎక్కించుకున్న ఘనుడు..

    - మాచ్చుపహాడ్ రెవిన్యూ గ్రామంలోని 215 సర్వే నెంబర్లో 40 ఎకరాల భూమి స్వాహా..ఖాళీగా ఉందని..కబ్జాకు ప్రయత్నం..

    .- కబ్జా కోరుకు..రెవిన్యూ అధికారుల అండదండలు.. పహాని మార్చిన లఘుపతి...

    - గత కొద్దికాలంగా..నర్మెట్ట మండల రెవిన్యూ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి లీలలు.. బ్రోకర్లను పెట్టుకొని దందా నడిపిస్తున్న వైనం..

    - డబ్బులు ఇస్తే క్షణాల్లో రికార్డు..మాయం.. రెవిన్యూ అధికారుల అవినీతి లీలాలపై దృష్టి సరించని ఉన్నత అధికారులు..

    - బాధితులు నిన్ననే కలెక్టర్ కి ఫిర్యాదు.. నామమాత్రంగా స్పందించిన కలెక్టర్.. బాధితులు నర్మెట్ట రెవిన్యూ కార్యాలయం ముందు ఆందోళన.. బిజెపి, mrps శ్రేణుల మద్దతు..

    - సమాధానం చెప్పలేక పోతు.., కుర్చీ నుండి బయటకి వెళ్లిపోయిన ఎమ్మార్వో....

    - ఎమ్మార్వో హస్తం ఉందంటూ బాధిత గిరిజనులు ఆవేదన..

  • 13 Aug 2020 2:55 AM GMT

    నిజామాబాద్ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద ఉధృతి.

    - ఇన్ ఫ్లో 23,522వేల క్యూసెక్యులు

    - ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం.1075.40అడుగులు.

    - 40.952 టీఎంసీలు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు,

    - 90 టీఎంసిలు.

Print Article
Next Story
More Stories