Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Nov 2020 3:23 AM GMT
Anantapur Updates: వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు..
అనంతపురం:
-ఎస్కే యూనివర్సిటీ లో వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు.
-రెండేళ్లుగా విధులకు హాజరు కాని సిద్దయ్య
-కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల ధ్రువపత్రం సమర్పణ
-విచారణ లో ఎటువంటి అనారోగ్యం లేదని నిర్ధారణ.
- 12 Nov 2020 3:21 AM GMT
Anantapur Updates: ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు..
అనంతపురం..
-అనంతపురం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు
-2019 - 2020 సంవత్సరానికి ఉత్తమ అవార్డుకు ఎంపికైన రామాంజనేయ గౌడ్
- 12 Nov 2020 3:18 AM GMT
Anantapur Updates: మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
అనంతపురం:
-సోమందేపల్లె లో మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.
-పలుచోట్ల 50శాతానికి పైగా పట్టు ముడిసరుకు వినియోగిస్తున్నారని గుర్తించిన అధికారులు
- 12 Nov 2020 3:01 AM GMT
Kadapa Updates: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కేసులో కదలిక...
కడప :
-మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో కదలిక...
-హైకోర్టు ఆదేశాలతో మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సిబిఐ...
-వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు...
-రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు తిరిగి జిల్లాకు వచ్చి అవకాశం
-జిల్లాకు వచ్చిన అనంతరం పులివెందుల కోర్టు నుంచి రికార్డులు తీసుకునే అవకాశం ...
-ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ వివరాలను కూడా పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం...
- 12 Nov 2020 2:58 AM GMT
Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,792 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 9,896 మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire