Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 11 Sep 2020 3:21 PM GMT

    CPI Venkat Reddy: సీఎం కేసీఆర్ ను కలిసి రెవెన్యూ బిల్లు పై వినతి పత్రం సమర్పించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి...

    - భూసర్వే చేపట్టడం మంచి పరిణామం ఆస్ట్రేలియా ,ఇజ్రాయిల్ లో చేసిన విధంగా డిజిటల్ లో చేసి రికార్డులు భద్రపరచాలి..

    - అసైన్డ్ ,ఇనాం,సీలింగ్ అటవీ భూములలో అనేక సంవత్సరాలు గా కస్థుల్లో ఉంటున్నప్పటికీ రికార్డులో లేవు వాటిని సరిచేసి అర్హులకు ఇవ్వాలి...

    - అన్యాక్రాంతమైన చెరువులు కుంటలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ల్యాండ్ బ్యాంక్ కింద రిజర్వు చేసుకోవాలి...

    - మిగిలి ఉన్న సాదాబైనామా ల క్రయ విక్రయాల క్రమబద్ధీకరణ తక్షణమే పూనుకోవాలి...

    - అటవీశాఖ రెవెన్యూ శాఖలోని స్వాధీనంలోని భూముల హద్దులు తక్షణమే సరిచేయాలి..

    - రికార్డులు తారుమారు చేసిన తప్పులతో నమోదు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి...

    - ఎల్ఆర్ఎస్ లో జీవో నెం 58,59 లను ప్రామాణికంగా తీసుకోవాలి..

  • 11 Sep 2020 3:20 PM GMT

    Telangana Assembly: ఈరోజు రెవెన్యూ చట్టం రావడం మంచి పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్

    - ఎక్కడ చూసినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే..

    - ప్రతి రోజు వందల సమస్యలు సీఎం దృష్టి కి రావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు..

    - కొంత మంది తీరు వల్ల ఈ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది అని సీఎం ఆలోచన చేశారు..

    - రైతులకే కాదు పేదలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి కొత్త చట్టం వచ్చింది..

  • 11 Sep 2020 3:19 PM GMT

    Telangana Updates: ఈరోజు తెలంగాణ రాష్ర్టంలో చారిత్రాత్మక రోజు: మంత్రి కొప్పుల ఈశ్వర్

    తెలంగాణ భవన్:

    - దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టం తెలంగాణ తీసుకొచ్చింది..

    - ఇప్పటికి వరకు ఏ రాష్ట్రం తీసుకురాలేదు..

    - భూముల పరిష్కారం కోసం కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారు..

    - పేదలకు సామాన్యులకు లాభం చేకూరుతుంది..

    - రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ చట్టం కోసం మూడేళ్ళుగా కృషి చేసారు సీఎం కేసీఆర్

    - రాష్ట్రంలో ఎంతోమంది కి లాభం చేకూరుతుంది..

    - దేశం తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది..

    - వీఆర్ఏ లను రేగులార్ చేస్తామని చెప్పడం బడుగు బలహీన వర్గాల ఉద్యోగులకు భరోసా ఇచ్చారు..

  • Kishan Reddy on KCR: కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెపుతున్నారు..
    11 Sep 2020 3:16 PM GMT

    Kishan Reddy on KCR: కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెపుతున్నారు..

    - రాష్ట్ర ప్రభుత్వని  ఇస్తేనే  నిధులు ఇచ్చినట్లా..? ప్రజలకు ఇస్తే ఇచ్చినట్లు కదా..?

    - ఈటెల రాజేందర్ ఒక్కడే కరోన కట్టడికి కష్టపడుతున్నాడు

    - కేసీఆర్ కు సచివాలయంపైన ఉన్న దృష్టి కరోన కట్టడిపై లేదు

    - ముద్రా లోన్స్, ఆత్మనిర్బర్ భారత్ పథకాల ద్వారా నగదును నేరుగా లబ్ది దారాలు ఖాతాలో జమ చేస్తున్నాం..

    - హెలికాప్టర్ మని సాధ్యం కాదు..

    - స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నగదు ముద్రించి ప్రజలకు ఇవ్వలేదు..

    - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • 11 Sep 2020 3:14 PM GMT

    ESI Scam: ఈఎస్ఐ స్కాంలో వెలుగుచూసిన అక్రమాలు..

    - తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న దేవికారాణి అవినీతి లీలలు.

    - రెండు కోట్లు 47 లక్షల రూపాయలు సీజ్ చేసిన ఏసీబీ..

    - బినామీల పేరుమీద పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసిన దేవికా..

    - సైబరాబాద్ లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు ప్రయత్నం..

    - బినామీల ద్వారా డబ్బులు బదిలీ చేసిన దేవికారాణి..

    - కోటి 29 లక్షల రూపాయలను దేవికారాణి బదిలీ..

    - 35 లక్షల రూపాయలు బినామీల ద్వారా బదిలీ చేసిన నాగలక్ష్మి..

    - దేవికారాణి డైరెక్ట్ గా 65 లక్షల రూపాయలు బదిలీ..

    - దేవికారాణి పై మరో కేసు నమోదు చేసిన ఏసీబీ

  • Nagarjuna Sagar Project updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద..
    11 Sep 2020 12:36 PM GMT

    Nagarjuna Sagar Project updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద..

    నల్గొండ :

    -8 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

    -ఇన్ ఫ్లో :1,57,613 క్యూసెక్కులు.

    -అవుట్ ఫ్లో :1,57,613 క్యూసెక్కులు.

    -పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు.

    -పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

    -ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు

  • 11 Sep 2020 11:02 AM GMT

    Board of Intermediate: జీతాలు చెల్లించని, సిబ్బందిని తొలగించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ సీరియస్..ఉమర్ జలీల్..

    ఇంటర్ బోర్డ్..

    ఉమర్ జలీల్ ...సెక్రటరీ ఇంటర్మీడియట్ బోర్డ్..

    -ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు

    -క్వాలిఫైడ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేకపోతే 2020- 21 అప్లికేషన్ దరఖాస్తును తిరస్కరిస్తాం

    -రెండేళ్ళ ఇంటర్ మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

    -నిబంధనలు పాటించని యాజమాన్యానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయబడుతుంది

  • Nagarjuna Sagar Project Updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద..
    11 Sep 2020 10:56 AM GMT

    Nagarjuna Sagar Project Updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద..

    నల్గొండ :

    -4 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

    -ఇన్ ఫ్లో :1,78,220క్యూసెక్కులు.

    -అవుట్ ఫ్లో :95,220 క్యూసెక్కులు.

    -పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు.

    -పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

    -ప్రస్తుత నీటిమట్టం: 589.80

  • 11 Sep 2020 10:48 AM GMT

    Indira Bhavan: ఇందిరా భవన్ లో ప్రారంభమైన దుబ్బాక ఎన్నికల సన్నాహక సమావేశం..

    ఇందిరా భవన్..

    -సమావేశం లో పాల్గొన్న

    -టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు   వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్, దుబ్బాక నాయకులు.

    ఉత్తమ్..

    -కాంగ్రెస్ కార్యకర్తల దృఢ సంకల్పంతో క్రమశిక్షణ తో పని చేయాలి...

    -దుబ్బాక ఎన్నికలలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించాలి.. గెలుపే ధ్యేయంగా పని చేయాలి.

    -కార్యకర్తలకు అండగా ఉంటాము పోరాటం చేయాలి, నిర్మాణాత్మకంగా పని చేయాలి..

    -దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..

    -టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ నేతలను నిలదీయాలి..

    -మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయి..

    -గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అన్ని కమిటీలు పూర్తి చేయాలి.

  • 11 Sep 2020 10:42 AM GMT

    Hyderabad updates: పాతబస్తి తాపచ్పట్రా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.....

    హైదరాబాద్..పాతబస్తి..

    -భర్తను హత్య చేసిన భార్య....

    -పెళ్లి జరిగి 20 రోజులు

    -పెళ్ళి జరిగిన తర్వాత భార్యను వేధించడంతో విసుగు చెంది రోకలిబండతో భర్తను కొట్టి చంపిన భార్య...

    -సంఘటన స్థలానికి చేరుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు...

    -చికిత్స పొందుతూ భర్త మృతి.

    -పోలీసుల అదుపులో నిందితురాలు..

Print Article
Next Story
More Stories