Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Sept 2020 11:36 AM IST
Kadapa updates: వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్సార్ ఆసరా ప్రధమ వారోత్సవాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..
కడప :
-డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కామెంట్స్ :
-కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నగరపాల సంస్థ కమీషనర్ లవన్న..
-మాటకు కట్టుబడి రుణం మొత్తాన్ని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే..
-మహిళలు లక్షాధికారులు కావాలనే వైఎస్సార్ మాటను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు..
-వైఎస్సార్ ఆసరాతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషంగా కనిపిస్తున్నారు..
-మహిళా సాధికారత కేవలం సీఎం వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది..
-చంద్రబాబు నిర్వాకం వల్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు..
-మహిళల సాధికారత కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్ కు మహిళలు అండదండలు అందించాలి..
- 11 Sept 2020 11:29 AM IST
Vijayawada Kanaka Durgamma updates: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శన వేళలు పొడిగింపు..
విజయవాడ..
-నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి పొడిగింపు
-సాయంత్రం దుర్గమ్మ కు నిర్వహించే పంచ హారతుల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
-అమ్మవారి దర్శనార్ధం, సేవల యందు పాల్గొనే భక్తులు ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలి
- 11 Sept 2020 11:18 AM IST
Tirumala updates: ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవం సేవకు భక్తులు నుంచి విశేష స్పందన..
తిరుమల...
-ఇప్పటి వరకు ఆన్ లైన్ లో 10 వేల టిక్కెట్లు కోనుగోలు చేసిన భక్తులు
-ఆగష్టు 15వ తేదిన ఒకే రోజు 1012 టిక్కేట్లును కోనుగోలు చేసిన భక్తులు.
-ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం సేవలో పాల్గోన్న భక్తులును 90 రోజుల లోపు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూన్న టిటిడి
-ప్రసాదాలును పోస్టల్ ద్వారా భక్తులుకు పంపనున్న టిటిడి.
- 11 Sept 2020 11:15 AM IST
Amaravati updates: చలమశెట్టి రామానుజయ్య గారి మృతి పట్ల సంతాపం:-నారా లోకేష్..
అమరావతి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-టిడిపి సీనియర్ నేత,రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ్య గారి మృతి పట్ల సంతాపం.
-కాపు కార్పోరేషన్ ద్వారా ఎంతోమంది కాపు సోదరులకు అండగా నిలిచిన వ్యక్తి.పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేసారు.
-చివరి శ్వాస వరకూ ప్రజాసేవే ఊపిరిగా జీవించారు.
-ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
-ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
- 11 Sept 2020 10:48 AM IST
Kakinada: కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఆటో నగర్ లో విషవాయువు లిక్..
తూర్పుగోదావరి :
-సొమ్మసిల్లి పడిపోయిన ఓక వ్యక్తి.. హాస్పటల్ కి తరలింపు..
-సంఘటన స్థలం చేరుకున్నా పోలీసులు, స్థానిక నాయకులు..
- 11 Sept 2020 10:40 AM IST
National updates: 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల..
జాతీయం..
-15వ ఆర్థిక సంఘం సిఫారసు ల మేర ఆరో వాయిదా కింద 6,195.08 కోట్లు విడుదల
-ఆంధ్రప్రదేశ్ కు 491.41 కోట్లు విడుదల చేసిన కేంద్రం
-కరోనా సంక్షోభ కాలంలో దీనితో రాష్ట్రాలకు మరింత అదనపు నిధులు అందుబాటులోకి వచ్చాయన్న కేంద్రం
- 11 Sept 2020 10:30 AM IST
Rajahmundry updates: అంతర్వేది స్వామి వారి రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన రాజోలు నియోజకవర్గ వ్యాపార సంస్థలు..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తో,
-తాటిపాక, రాజోలు ,లక్కవరం, మలికిపురం, సఖినేటిపల్లి లో వ్యాపార సంస్థలు బంద్
- 11 Sept 2020 9:35 AM IST
Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..
అమరావతి..
-నాడు రాజధాని నిప్పుపై సిబిఐ విచారణ కాదు కదా ఉన్న విచారణనే క్లోజ్ చేసి పారిపోయిన ప్రభుత్వం చంద్రబాబుది.
-నేడు రథానికి నిప్పుపై ధైర్యంగా సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జగనన్నది. ఎవరికుంది చిత్తశుద్ది ?
- 11 Sept 2020 9:31 AM IST
Prakasam-Ongole updates: ఒంగోలు పోలీసు పెరడ్ గ్రౌండ్లో జరుగుతున్న పాస్ ఔట్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి..
ప్రకాశం జిల్లా...
-ఒంగోలు పోలీసు పెరడ్ గ్రౌండ్లో జరుగుతున్న పాస్ ఔట్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్, హోమంత్రి సుచరిత, మంత్రి బాలినేని.
-స్థానిక పీటీసీలో తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకొన్న పోలీసులనుద్దే సించి ప్రసగించనున్న డీజీపీ, హోంమంత్రి.
- 11 Sept 2020 9:25 AM IST
Rajahmundry updates: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో రథాల రక్షణపై దృష్టి పెట్టిన దేవాదాయ శాఖ..
తూర్పుగోదావరి - రాజమండ్రి..
-రాష్ట్రంలో చిన్న, పెద్ద దేవాలయాలలో కలిపి 405 రథాలు వున్నట్టు దేవాదాయ శాఖ గుర్తించింది
-వారంరోజులలో అన్ని చోట్లా సిసి కెమెరాల పర్యవేక్షణ వీలుగా వాటిని ఏర్పాటుకు కసరత్తు..
-ఆలయాల వద్ద వాచ్మెన్ , సెక్యురిటీ వ్యవస్థ పటిష్టం చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు..










