Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Oct 2020 11:45 AM IST
Hyderabad updates: హైదరాబాద్ JNTUH లో క్యూ కట్టిన ర్యాంకులు రాని ఎంసెట్ అభ్యర్థులు...
హైదరాబాద్..
-టీఎస్ ఎంసెట్ కార్యాలయంలో ఫోటో కాపీలు సమర్పిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు
-రేపటి నుండి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుండటంతో ఆందోళనలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు
-రేపటి లోపు ర్యాంకు కేటాయించక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్న పేరెంట్స్
-అక్నాలెడ్జ్మెంట్ కాపీలు ఇవ్వాలంటూ డిమాండ్
- 8 Oct 2020 11:42 AM IST
Kamareddy updates: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం...
కామారెడ్డి :
-మాచారెడ్డి మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి ఘరానా మోసం.
-ఇద్దరూ నిరుద్యోగుల నుంచి లక్ష 12 వేల రూపాయలు వసూలు.
-డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు గురి చేస్తున్న లక్ష్మీనారాయణ.
-మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు
- 8 Oct 2020 11:38 AM IST
Telangana updates: తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్...
-ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్ నెట్ నెట్ వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వ సర్క్యులర్.
-రాష్ట్రంలోని 590 కార్యాలయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 ఎంబీపీఎస్ వేగం ఉన్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్.
-అదనంగా మరో కనెక్షన్ తీసుకునేందుకు అనుమతి.
-స్పీడ్ ఎక్కువగా ఉండే లోకల్ నెట్ వర్క్ కనెక్షన్ తీసుకునే వేసులుబాటును తహసీల్దార్లకు కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు.
- 8 Oct 2020 11:37 AM IST
DGP M Mahender Reddy updates: సమాజ సేవకుడిగా పోలీస్ రోజూ విధుల్లో ఉండాలి...
డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి....
-సమాజంలో ప్రజల భద్రత, సంక్షేమాం దెయ్యంగా ప్రతి క్షణం పని చేయాలి.
-శాంతి, భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాథ్యం.
-తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పోలీస్ శాఖ పని తనానికి నిదర్శనం.
-సీఎం కెసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
-దేశంలోనే తెలంగాణ పోలీస్ పనితీరు ఉన్నతంగా ఉంది...
-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని వినియోగించడంతో నేరాలు జరిగిన అతి కొద్ది సమయంలోనే నేరస్తులను పట్టు కోవడం జరుగుతోంది.
-పోలీస్ స్టేషన్లకు అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలకు సరైన గౌరవం, మర్యాద ఇచ్చి సరైన రీతిలో స్పందించి పోలీస్ శాఖ గౌరవంచాలి...
- 8 Oct 2020 11:29 AM IST
Telangana updates: దేశం లోనే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఆదర్శనీయం గా ఉంది..
హోమ్ మంత్రి మహమూద్ అలీ..
-ప్రత్యేక తెలంగాణ లో పోలీస్ శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
-పోలిస్ వాహనాల కొనుగోలుకి రూ.700 కోట్లు
-కొత్తగా 7 పోలీస్ కమీషనరేట్లు ఏర్పాటు చేసాం.
-మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేసాం.
- 8 Oct 2020 8:57 AM IST
Bhadradri Kothagudem District updates: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ కు పెరిగిన వరద ఉదృతి..
భద్రాద్రి కొత్తగూడెం..
-ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న నీరు.
-ప్రాజెక్ట్ కు చెందిన 25 గేట్లలో 10 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 33, 410 క్యూసెక్కుల నీరు గోదావరి లోకి విడుదల.
-ఇన్ ఫ్లో 29, 378 క్యూసెక్కులు.
- 8 Oct 2020 8:52 AM IST
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా...
-20 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.54 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 41,000 క్యూసెక్కులు








