Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Oct 2020 10:09 AM IST
Yeleru Reservoir updates: ఏలేరు రిజర్వాయరులో నీటి ప్రవాహం దిగువకు విడుదల..
తూర్పుగోదావరి..
-ఏలేశ్వరం (మం) ఏలేరు రిజర్వాయరులో ఐదుగేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదల
-ప్రాజెక్టు పూర్తినీటిమట్టం 86.56 మీటర్ల , ప్రస్తుత నీటిమట్టం 85.73 మీటర్లు
-ఏలేరు ముంపులో కొనసాగుతున్న పిఠాపురం ,గొల్లప్రోలులో పలు గ్రామాలలో వరిపొలాలు..
- 8 Oct 2020 10:02 AM IST
Vizianagaram updates: విద్యాదీవేన కార్యమాన్ని ప్రారంబించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ..
విజయనగరం..
-నేడు చీపురుపల్లిలో విద్యాదీవేన కార్యమాన్ని ప్రారంబించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
-విద్యాదీవేన ద్వారా ఏపి ప్రభుత్వం అందిస్తున్న కిట్స్ విద్యార్థులకు అందించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
- 8 Oct 2020 9:58 AM IST
East Godavri updates: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జగనన్న విద్యాకానుక...
తూర్పుగోదావరి..
-జిల్లాలో అన్ని 4,335 ప్రభుత్వ పాఠశాలలో 4లక్షల 19వేల 445 మంది పిల్లలకు జగనన్న విద్యాకానుక
-మూడు రోజుల పాటు 1నుంచి పదోతరగతి విద్యార్ధులకు విద్యా కానుక కింద పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగు, బూట్లు, సాక్సులతో కూడిన కిట్టు
-ఇప్పటి వరకు 81 శాతం కిట్లే జిల్లాకు చేరాయి.
-కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోజుకు 1/3 వంతు మంది పిల్లలకు పంపిణీ
- 8 Oct 2020 8:47 AM IST
C.M.Jagan: విద్యాదీవెన ప్రారంభించనున్న సీఎం జగన్..
కృష్ణాజిల్లా...
-పునాదిపాడులో జగనన్న విద్యాదీవెన ప్రారంభించనున్న సీఎం జగన్
-స్కూలు బ్యాగ్, మూడు జతల యూనిఫారంలు, నోట్ బుక్స్, టెక్స్టు బుక్స్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు
-ప్రతీ ఒక్కరూ చదువుకోవాలన్న లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన
-పునాదిపాడులో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
-పది గంటలకు పునాదిపాడు చేరుకోనున్న సీఎం
- 8 Oct 2020 8:31 AM IST
Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,669 మంది భక్తులు
-తలనీలాలు సమర్పించిన 7,273 మంది భక్తులు
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.42 కోట్లు








