Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Aug 2020 10:42 AM GMT

    సిద్దిపేట జిల్లా:

    - సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అయినాపూర్ గ్రామంలో 20 మంది కి కరోనా టెస్ట్ చేయడంతో అందులో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ వైద్య అధికారి వెల్లడించారు

  • 8 Aug 2020 10:41 AM GMT

    సిద్ధిపేట జిల్లా:

    - ములుగు మండలం తునికి బొల్లారం లో పొలం వద్ద పనులు చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి మురళీ అనే యువ రైతు మృతి

  • 8 Aug 2020 10:34 AM GMT

    హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి

    - హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి

    - 130కి పైగా బిల్స్ పై ఫిర్యాదులు.

    - 16 ఇన్సూరెన్స్ సంబంధించిన ఫిర్యాదులు.

    - ఆస్పత్రులు మూసి వేయడం మా ఉద్దేశ్యం కాదు.

    - ప్రయివేటు ఆస్పత్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం.

  • 8 Aug 2020 10:32 AM GMT

    DME రమేష్ రెడ్డి

    - 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

    - మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది

    - ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం

    - కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడ్తోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు

    - కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు

    - పాజిటివ్‌ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరంలేదు

    - జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం

  • 8 Aug 2020 10:30 AM GMT

    తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు: డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు..

    - తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు అంటోన్న డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

    - సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతోంది

    - కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి

    - తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి

    - తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్‌ రేటు నమోదవుతోంది

    - ప్రభుత్వం తాజాగా కరోనా నివారణ చర్యలకు వంద కోట్లు కేటాయించింది

    - కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు

    - 11వందల సెంటర్స్ లో రోజుకు 20వేలకుపైగా టెస్టులు చేస్తున్నాం

    - పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం

    - కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం

  • 8 Aug 2020 10:29 AM GMT

    శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక

    - శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక రాజేంద్రనగర్ పొలిస్టేషన్ పరిధి హిమయత్ సాగర్ లో శవమై తేలింది

    - శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గుడాకు చెందిన ప్రేమలత 4 వ తేది నుండి మిస్సింగ్వి

    - విజయ్ అనే యువకుడి చేతిలో గతంలో మోసపోయిందని అతడే ఏమైనా చేసుంటాడాని అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు

    - విజయ్ పై అరోపణల మేరకు ఆర్జీఐఏ పొలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో హిమాయత్ సాగర్ లో శవమై తేలిన ప్రేమలత

  • 8 Aug 2020 10:26 AM GMT

    ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

    - మాజీ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    - కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.

    - దళిత నాయకుడు, మంచి పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

    - ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

    - చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

  • 8 Aug 2020 9:43 AM GMT

    మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: రేవంత్ రెడ్డి

    - దళిత శిఖరం, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    - ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు, తెలంగాణ సమాజానికి తీరని లోటు.

    - జీవితాంతం దళిత, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం ఎల్లయ్య పోరాడారు.

    - నిమ్నవర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఆయన ఘనతకు నిదర్శనం.

    - కాంగ్రెస్ సిద్ధాంతాల అమలులో రాజీలేని వైఖరిని అవలంభించారు.

    - రాజకీయాల్లో విలువలకు ప్రతినిధిగా నిలిచారు.

    - ఆయన లేని లోటు తీర్చలేనిది.

    - ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

  • 8 Aug 2020 9:39 AM GMT

    ఢిల్లీ:

    👇 గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి

    కోజికోడ్ ఎయిర్పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉంది

    - ఈ అంతర్జాతీయ విమానాశ్రయం లో పెద్ద విమానాలు దిగేందుకు ఇది తప్పనిసరి

    - మరి రన్ వే ఎక్స్టెన్షన్ చేశారా ? లేదా అన్న విషయం నాకు తెలియదు

    - ఎయిర్ పోర్టు, ఎయిర్క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి

    - డీజిసీఎ నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది

  • 8 Aug 2020 9:37 AM GMT

    జాతీయం:

    కరోనా చికిత్స పూర్తి చేసుకుని అభిషేక్ బచ్చన్ డిశ్ఛార్జ్

Print Article
Next Story
More Stories