Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Aug 2020 4:12 PM IST
సిద్దిపేట జిల్లా:
- సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అయినాపూర్ గ్రామంలో 20 మంది కి కరోనా టెస్ట్ చేయడంతో అందులో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ వైద్య అధికారి వెల్లడించారు
- 8 Aug 2020 4:11 PM IST
సిద్ధిపేట జిల్లా:
- ములుగు మండలం తునికి బొల్లారం లో పొలం వద్ద పనులు చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి మురళీ అనే యువ రైతు మృతి
- 8 Aug 2020 4:04 PM IST
హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి
- హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి
- 130కి పైగా బిల్స్ పై ఫిర్యాదులు.
- 16 ఇన్సూరెన్స్ సంబంధించిన ఫిర్యాదులు.
- ఆస్పత్రులు మూసి వేయడం మా ఉద్దేశ్యం కాదు.
- ప్రయివేటు ఆస్పత్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం.
- 8 Aug 2020 4:02 PM IST
DME రమేష్ రెడ్డి
- 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
- మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది
- ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం
- కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడ్తోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు
- కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు
- పాజిటివ్ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరంలేదు
- జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం
- 8 Aug 2020 4:00 PM IST
తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు: డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు..
- తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు అంటోన్న డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
- సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతోంది
- కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి
- తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి
- తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్ రేటు నమోదవుతోంది
- ప్రభుత్వం తాజాగా కరోనా నివారణ చర్యలకు వంద కోట్లు కేటాయించింది
- కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు
- 11వందల సెంటర్స్ లో రోజుకు 20వేలకుపైగా టెస్టులు చేస్తున్నాం
- పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం
- కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం
- 8 Aug 2020 3:59 PM IST
శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక
- శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక రాజేంద్రనగర్ పొలిస్టేషన్ పరిధి హిమయత్ సాగర్ లో శవమై తేలింది
- శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గుడాకు చెందిన ప్రేమలత 4 వ తేది నుండి మిస్సింగ్వి
- విజయ్ అనే యువకుడి చేతిలో గతంలో మోసపోయిందని అతడే ఏమైనా చేసుంటాడాని అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు
- విజయ్ పై అరోపణల మేరకు ఆర్జీఐఏ పొలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో హిమాయత్ సాగర్ లో శవమై తేలిన ప్రేమలత
- 8 Aug 2020 3:56 PM IST
ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
- మాజీ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
- కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.
- దళిత నాయకుడు, మంచి పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నాడు.
- ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
- చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
- 8 Aug 2020 3:13 PM IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: రేవంత్ రెడ్డి
- దళిత శిఖరం, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
- ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు, తెలంగాణ సమాజానికి తీరని లోటు.
- జీవితాంతం దళిత, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం ఎల్లయ్య పోరాడారు.
- నిమ్నవర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఆయన ఘనతకు నిదర్శనం.
- కాంగ్రెస్ సిద్ధాంతాల అమలులో రాజీలేని వైఖరిని అవలంభించారు.
- రాజకీయాల్లో విలువలకు ప్రతినిధిగా నిలిచారు.
- ఆయన లేని లోటు తీర్చలేనిది.
- ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- 8 Aug 2020 3:09 PM IST
ఢిల్లీ:
👇 గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి
కోజికోడ్ ఎయిర్పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉంది
- ఈ అంతర్జాతీయ విమానాశ్రయం లో పెద్ద విమానాలు దిగేందుకు ఇది తప్పనిసరి
- మరి రన్ వే ఎక్స్టెన్షన్ చేశారా ? లేదా అన్న విషయం నాకు తెలియదు
- ఎయిర్ పోర్టు, ఎయిర్క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి
- డీజిసీఎ నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది



