Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Aug 2020 10:02 AM IST
బాన్సువాడ లో నేటి నుంచి ఈ నెల 17 వరకు సెల్ఫ్ లాక్ డౌన్.
కామారెడ్డి :
- కరోన ఉధృతి నేపథ్యం లో ఈ అఖిల పక్షం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం.
- అత్యవసర నిత్యావసర సరుకులు మెడికల్ షాప్స్ మినహా అన్ని బంద్
- రోడ్ల పైకి వస్తే వెయ్యి నుంచి 5 వేల వరకు జరిమాన.
- 7 Aug 2020 9:55 AM IST
సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని కి ఈడి నోటీసులు..
- తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ముంబై ఈడి.
- సుశాంత్ మరణం తర్వాత పోలీసులు అనుమతి తో హైదరాబాద్ చేరుకున్న సిద్ధార్థ..
- సుశాంత తో కలిసి కొన్నాళ్ళపాటు అదే ఇంట్లో ఉన్న సిద్ధార్థ పితాని..
- సుశాంత్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్న ట్లుగా గా తెలిపిన ఈ డి..
- సుశాంత్ కు క్రియేట్ మేనేజర్గా పని చేసిన సిద్ధార్థ.
- సుశాంత్ ప్రియురాలు రియా కు 15 కోట్లు వ్యవహారంపై ఆరా..
- రియా కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ ఇప్పటికే సిద్ధార్థ కు ఫోన్ కాల్స్.
- తనకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధార్థ...
- 7 Aug 2020 9:48 AM IST
- ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారికి భార్య వియోగం
- గుండె పోటు తో చనిపోయిన పరుచూరి విజయలక్ష్మి (74)
- 7 Aug 2020 9:45 AM IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద
నిజామాబాద్ జిల్లా:
- ఇన్ ఫ్లో 3882 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 6572 క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు
- ప్రస్తుత నీటిమట్టం 1074.40 అడుగులు 38.309 టీఎంసీలు.
- 7 Aug 2020 9:44 AM IST
సూర్యాపేట :
- ఇవాళ జిల్లాలో మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డిల పర్యటన...
- కోదాడ, హుజుర్ నగర్ లలో చెరువు లలో చేప పిల్లలను వదలి అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు...
- 7 Aug 2020 9:43 AM IST
నిజామాబాద్ జిల్లా:
- ఎర్గట్ల మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బీమ్ గల్ కు చెందిన ఒక విఆర్వో కు కరోన పాజిటివ్ గా నిర్దారించిన వైద్యులు.
- 7 Aug 2020 9:42 AM IST
జిల్లాలో 1350 కి చేరిన కరోనా కేసులు
నిజామాబాద్ :
- గడిచిన 24 గంటల వ్యవధిలో 91 పాజిటివ్ కేసుల నమోదు.
- ప్రతి పల్లెకు సోకిన వైరస్.
- నిజామాబాద్ నగరం లో 800 పాజిటివ్ కేసులు
- 7 Aug 2020 9:41 AM IST
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1355 కరోనా పాజిటివ్ కేసుల నమోదు.
కామారెడ్డి జిల్లా :
- జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1355 కరోనా పాజిటివ్ కేసుల నమోదు.
- కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 20 కాగా 270మంది డిశ్చార్జ్, 1065 యాక్టివ్ కేసులు.
- 7 Aug 2020 9:39 AM IST
నేడు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం..
నిజామాబాద్:
- కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకొనున్న పాలక వర్గం.
- కారోనా తీవ్రత నేపధ్యం లో జూమ్ యాప్ లో ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం..
- ఐదు స్థానాలకు బరిలో 12 మంది అభ్యర్థులు.



