Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం 7సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 7 Aug 2020 4:24 AM GMT

    సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని కి ఈడి నోటీసులు..

    - తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ముంబై ఈడి.

    - సుశాంత్ మరణం తర్వాత పోలీసులు అనుమతి తో హైదరాబాద్ చేరుకున్న సిద్ధార్థ..

    - సుశాంత తో కలిసి కొన్నాళ్ళపాటు అదే ఇంట్లో ఉన్న సిద్ధార్థ పితాని..

    - సుశాంత్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్న ట్లుగా గా తెలిపిన ఈ డి..

    - సుశాంత్ కు క్రియేట్ మేనేజర్గా పని చేసిన సిద్ధార్థ.

    - సుశాంత్ ప్రియురాలు రియా కు 15 కోట్లు వ్యవహారంపై ఆరా..

    - రియా కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ ఇప్పటికే సిద్ధార్థ కు ఫోన్ కాల్స్.

    - తనకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధార్థ...

  • 7 Aug 2020 4:20 AM GMT

    జాతీయం:

    - భారతదేశంలో 20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

  • 7 Aug 2020 4:19 AM GMT

    ఏపీలో 13 మంది యువ ఐఎఎస్ లకు పోస్టింగులు..

    అమరావతి:

    1. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎం ఎస్ మురళి

    2. పృధ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప)

    3. ప్రతిష్ఠ మాంగైన్ – సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ)

    4. హిమాన్షూ కౌశిక్ – సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి)

    5. అమిలినేని భార్గవ్ తేజ – సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం)

    6. విధే ఖారే – సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓగా అదనపు బాధ్యతలు)

    7. నారపురెడ్డి మౌర్య – సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం)

    8. శ్రీవాస్ అజయ్ కుమార్ – సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు)

    9. అనుపమ అంజలి – సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి)

    10. సూరజ్ ధనుంజయ్ – సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం)

    11. మేదిడ జాహ్నవి – సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు)

    12. కల్పన కుమారి – సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్)

    13. కేతన గార్గ్ – సబ్ కలెక్టర్ రాజంపేట (కడప)

  • 7 Aug 2020 4:18 AM GMT

    అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

    తూర్పుగోదావరి:

    - కరోనా లక్షణాల అనుమానంతో టెస్ట్ చేయించుకోవడంతో వెలుగుచూసిన పాజిటీవ్

    - ప్రస్తుతం హైదరాబాద్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొఁదుతున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

    - తాను కరోనా బాధితుల పరామర్శకైఎక్కువగా పర్యటించడంతో వైరస్ సోకిందని భావిస్తున్నాను

    - ఆరోగ్యం బాగానే వుందని త్వరలోనే వచ్చి అందర్నీ కలుస్తానని పేర్కొన్న ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి

  • 7 Aug 2020 4:17 AM GMT

    - ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారికి భార్య వియోగం

    - గుండె పోటు తో చనిపోయిన పరుచూరి విజయలక్ష్మి (74)

  • 7 Aug 2020 4:17 AM GMT

    తూర్పుగోదావరి:

    - రాజమహేంద్రవరం సబ్ కలెక్టరు గా అనుపమ అంజలి, అమలాపురం సబ్ కలెక్టరు గా హిమాంశుకౌశిక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

  • 7 Aug 2020 4:16 AM GMT

    తుంగభద్ర కి భారీగా వరద ప్రవాహం..

    అనంతపురం: 

    - ఇన్ ఫ్లో: 81,218 క్యూసెక్కులు.

    - ఔట్ ఫ్లో: 8,225 క్యూసెక్కులు.

    - ప్రస్తుతం నీటి నిల్వ: 46.556 టీఎంసీలు.

    - పూర్తి సామర్థ్యం: 100.85 టీఎంసీలు.

    - డ్యాం లో నీటి లెవెల్ : 1615.35 అడుగులు.

    - డ్యాం పూర్తి నీటి మట్టం: 1633 అడుగులు.

  • 7 Aug 2020 4:16 AM GMT

    తాడేపల్లిగూడెం క్వారంటైన్ లో కరోన బాధితుల ఆందోళన...

    ప.గో:

    - చాలీచాలని,నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రోడెక్కిన బాధితులు

    - ,వైద్యసేవలు అందించడం లేదంటు ఆగ్రహం

    - ప్రశ్నించిన వారిని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని...

    - క్వారంటైన్ సిబ్బందిపై తీసుకోవాలని బాధితులు డిమాండ్..

  • 7 Aug 2020 4:12 AM GMT

    గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో స్వల్పంగా పెరిగిన వరద ఇన్ ఫ్లో

    తూర్పుగోదావరి

    - 88వేల 500 క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల

    - ధవలేశ్వరం వద్ద 10.15 అడుగుల గోదావరి నీటమట్టం

    - భారీవర్షాలతో పంటకాల్వలకు తగ్గించిన సాగునీరు విడుదల

  • 7 Aug 2020 4:10 AM GMT

    రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలా కరోనా విజృంభన

    తూర్పుగోదావరి:

    - రాజమండ్రి సెంట్రల్ జైలు కరోనా ఆఫ్టేడ్స్

    - రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలా కరోనా విజృంభన

    - కరోనా పంజరంలో రాజమండ్రి జైలు ఖైదీలు

    - 983 ఖైదీలకు నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలలో 265 మందికి పాజిటీవ్ నిర్ధారణ

    - ఇప్పటికే మరో 25 మంది సిబ్బందికి కరోనా తో చికిత్స

    - గత కొద్దిరోజుల్లో పాజిటీవ్ వచ్చిన ఖైదీలకు రాజమండ్రి ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స

    - జైలులో వైద్యబృందాలు పర్యటన

    - మరో రెండు రోజులలో మరో 600 మందికి పైగా ఖైదీల కరోనా టెస్ట్ ల ఫలితాలు

    - జైలులో అపారంగా పెరిగిపోతున్న పాజిటీవ్ కేసులకు చికిత్స ఎక్కడ అందించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్న జైలు అధికారులు

    - సెంట్రల్ జైలులోనే కొవిడ్ కేర్ సెంటర్ కమ్ క్వారంటైన్‌ ఏర్పాటుకు జైలు, వైద్యాధికారులు సమాలోచనలు

    - జైలులొలో సీరియస్ కొవిడ్ లక్షణాలు గల కేసులు అంతగా కన్పించడం లేదంటున్న వైద్యులు

    - రాజమండ్రి సెంట్రల్ జైలులో మొత్తం 1666 ఖైదీలు, 205 మంది వరకూ సిబ్బంది..

    - నిన్నకరోనాతో విజయవాడ కు చెందిన ఓ ఖైదీ మృతితో ఆందోళన చెందుతున్న సెంట్రల్ జైలు ఖైదీలు..

Print Article
Next Story
More Stories