Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Oct 2020 8:45 AM IST
Weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన!
విశాఖ...
-వాయువ్య బంగాళాఖాతం, ఒడిసా తీర ప్రాంతాల్లో అల్పపీడనం....
-అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్, ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
-తూర్పు బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
-వీటి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
-రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు కురిసే అవకాశం..
-రానున్న 4 రోజులు ఉత్తరాంధ్ర, యానాం, సీమల్లో వర్షాలు కురిసే అవకాశం.
- 6 Oct 2020 8:35 AM IST
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,867 మంది భక్తులు
-తలనీలాలు సమర్పించిన 6,425 మంది భక్తులు
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.44 కోట్లు
- 6 Oct 2020 8:06 AM IST
Anantapur district: ఖజానా శాఖ సీనియర్ అసిస్టెంట్ మనోజ్ కుమార్ అరెస్ట్...
అనంతపురం:
-అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై ఖజానా శాఖ సీనియర్ అసిస్టెంట్ మనోజ్ కుమార్ అరెస్ట్.
-మనోజ్ కుమార్ తో పాటు డ్రైవర్ నగలింగా ను కర్నూల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చిన అధికారులు.
-నిందితులకు 14 రోజుల రిమాండ్ విధింపు
- 6 Oct 2020 7:47 AM IST
Srisailam Dam updates: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద..
కర్నూలు జిల్లా...
-జలాశయం అన్ని క్రస్ట్ గేట్లు మూసివేత
-ఇన్ ఫ్లో : 50,936 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 30,614 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.80 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 6 Oct 2020 7:42 AM IST
Karnataka updates: కన్నడ చిత్రసీమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ..
కర్ణాటక:
-నిందితులు ప్రశాంత్ రాంకా, నియాజ్ అహ్మద్, వైభవ్ జైన్, ప్రతీక్ శెట్టి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఎన్ డి పి ఎస్ ప్రత్యేక న్యాయస్థానం
-కేసులో పరారీలో ఉన్న నిందితులు అభిస్వామి, ప్రశాంత్ రాజు బెయిల్ పిటిషన్ లు కొట్టివేసిన కోర్టు.







