Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Sept 2020 11:15 AM IST
Vijayawada updates: గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....
కృష్ణాజిల్లా....
-గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....
-టీవీ రిపేర్ చేస్తానంటూ వచ్చి అయినంపూడి పద్మ అనే మహిళ మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు.....
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గన్నవరం క్రైమ్ పోలీసులు......
- 6 Sept 2020 11:13 AM IST
Visakhapatnam updates: విశాఖ శిరోమండనం కేసులో నూతన నాయుడు ను అనకాపల్లి సబ్ జైలుకు తరలించిన పోలిసులు...
విశాఖ...
-ఎస్సీ అట్రాసీటీ కేసు తొ పాటు పలు సెక్షన్లు నమోదు చేసిన పోలిసులు.
-నూతన్ నాయుడు పై గతంలో మూడు పోలీస్ స్టేషన్లు లో కేసులు..
-వాటిపై కూడా ఆరా తీస్తున్న పోలిసులు..
- 6 Sept 2020 11:05 AM IST
Antervedi updates: రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి:-స్వరూపానందేంద్ర..
అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన
అంతర్వేది ఘటన దురదృష్టకరం
-స్వరూపానందేంద్ర
-దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి
-హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది
-నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి
-స్వరూపానందేంద్ర..
- 6 Sept 2020 10:35 AM IST
East Godavari updates: అంతర్వేది లో రథం అగ్నికి ఆహుతి అవ్వడం చాలా బాధాకరం..
తూర్పుగోదావరి..
-18 వ శతాబ్దం నుండి వంశపారంపర్య ధర్మకర్తగా మొగల్తూరు రాజవంశీయులే స్వామి రథోత్సవం ప్రారంభిస్తుంటారు
-62 ఏళ్ల క్రితం రథాన్ని పునర్నిర్మాణం చేసి 40 అడుగుల ఎత్తులో నిర్మిచారు
-అగ్నిప్రమాదం ఘటన కలచివేసింది, దర్యాప్తు చేయాలి
- రామ గోపాల రాజా బహద్దూర్, మొగల్తూరు రాజ వంశీయులు
- 6 Sept 2020 9:41 AM IST
Visakhapatnam updates: పర్యాటక అభివృద్ధి కి రాష్ట్ర పర్యటక శాఖ ప్రత్యేక ప్రోత్సాహం -పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు...
విశాఖ....
-కోవిడ్ వలన నష్టపోయిన పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం..
-విశాఖ ను టూరిజం హబ్ గా మరింత ప్రగతిపథంలో నడిపేందుకు ప్రణాళికలు...
-నేటి నుండి విశాఖ లో తెరుచుకోనున్న కొన్ని పర్యాటక కేంద్రాలు.
- 6 Sept 2020 9:32 AM IST
Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా.....
-1 క్రస్ట్ గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 28,075 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-ప్రస్తుతనీటి మట్టం:885.00 అడుగులు
-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-ఇన్ ఫ్లో:53,304 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 96,994 క్యూసెక్కులు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి.








