Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Oct 2020 10:04 AM IST
Amaravati updates: వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు..
అమరావతి..
-వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
-ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి శ్రీ కన్నబాబు పాల్గొంటారు
- 2 Oct 2020 10:02 AM IST
Guntur updates: సత్తెనపల్లి మండలం భట్లురు గ్రామంలో కరోన పంజా..
గుంటూరు జిల్లా..
-గ్రామంలో స్టడీ అవర్స్ నిర్వహించిన ప్రైవేటు ట్యూషన్ సెంటర్
-ప్రైవేటుఉపాధ్యాయుడుకి కరోన పాజిటివ్
-ఉపాధ్యాయుడి తో పాటు14 మంది విద్యార్థులకు కరోన పాజిటివ్
-ట్యూషన్ సెంటర్లో 50 మంది విద్యార్థులతో స్టడీ అవర్ నిర్వహణ
-విద్యార్థులు అంత ఏడు సంవత్సరలలోపు (చిన్నారులు)
-తల్లిదండ్రులు చిన్నారులకు కరోన పరీక్షలు..పాజిటివ్ గా నిర్ధారణ...
-గుంటూరు యన్ అర్ ఐ శ్రీచైతన్య సాయి సధన్ క్వరెంటైన్ సెంటర్లకు తరలింపు...
-ఒక్కరోజే గ్రామము లో 39 కేసులు
-హుటాహుటిన గ్రామంలో సత్వర చర్యలుచేపట్టిన అధికారులు
-భట్లూరు ఎస్సీకాలనీ ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించిన అధికారులు
-భయం గుప్పెట్లో భట్లూరు గ్రామంలో ప్రజలు.......
- 2 Oct 2020 9:59 AM IST
Kadapa updates: సీబీఐ అధికారికి కరోనా...
కడప :
-మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా...
-కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అధికారి...
-నిన్న కరోనా టెస్టు చేయించుకున్న ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
-కొవిడ్ సోకడంతో వ్యక్తిగత ఐసోలేషన్ లో ఉంటున్న ఆ అధికారి..
-నేడు కరోనా టెస్టు చేయించుకోనున్న మిగతా అధికారులు...
- 2 Oct 2020 9:55 AM IST
Kadapa updates: ఎగువన కురిసిన వర్షాలతో గండికోటకు కొనసాగుతున్న వరద ప్రవాహం...
కడప :
జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 6500, పరివాహక ప్రాంతం నుంచి 15800 క్యూసెక్కుల నీరు రాక...
గండికోట జలాశయంలొ 16.2 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ...
మైలవరానికి 21 వేల క్యూసెక్కులు విడుదల ...
మైలవరం నుంచి 9 గేట్ల ద్వారా 30 క్యూసెక్కుల నీరు విడుదల
దిగివన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అదినిమ్మాయపల్లె నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు పెన్నా ద్వారా సొమశిలకు విడుదల
ప్రభుత్వ తీరును నిరసిస్తూ గండికొట నిర్వాసితులు కొనసాగిస్తున్న నిరసన..
- 2 Oct 2020 9:50 AM IST
Amaravati updates: ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ..
అమరావతి..
డిప్యూటీ సీఎం అంజాద్ భాషా..
-ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ.
-సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.
-అటువంటి మహనీయుని జయంతి ఈరోజు.
-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు.
- 2 Oct 2020 8:54 AM IST
Annavaram updates: అన్నవరం సత్యదేవుని దేవస్థానం వెబ్సైట్లో వ్రత పూజ కోసం ఆన్లైన్ ద్వారా రుసుం...
తూర్పుగోదావరి...
-అన్నవరం సత్యదేవుని దేవస్థానం వెబ్సైట్లో వ్రత పూజ కోసం ఆన్లైన్ ద్వారా రుసుం రూ. 1,116 నిర్ణయం
-భక్తులు ఆన్లైన్లో స్వామివారి వ్రతం వీక్షించే అవకాశంతో పాటు ఇంట్లో ఆచరించే వీలును అధికారులు యూట్యూబ్ లింక్ ద్వారా కల్పిస్తారు
-నేటి నుంచి ఆన్ లైను సత్యనారాయణ స్వామి వృతాలు ప్రారంభం..
- 2 Oct 2020 8:45 AM IST
East godavari updates: వివిధ కేటగిరీల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలు భర్తీ...
తూర్పుగోదావరి...
డీఎంహెచ్వో కేవీఎస్ గౌరీశ్వరరావు..
-జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలు భర్తీ
-వైద్యాధికారులు, స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర కేటగిరీల ఖాళీల వివరాలను eastgodavari.ap.gov.in వెబ్సైట్లో చూడొచ్చు
-ఈనెల 10లోగా దరఖాస్తులు అందజేయాలనీ, ఈనెల 17న తుది ఎంపిక జాబితా విడుదల
-19న ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తాం
- 2 Oct 2020 8:42 AM IST
East Godavari updates: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులను రెన్యువల్ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలి!
తూర్పుగోదావరి..
-2020-21 విద్యాసంవత్సరానికిగాను జోన్-1, 2 పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను రెన్యువల్ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలి
-జోన్ 1, 2 పరిధిలోని అధ్యాపకులు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు ఈ నెల 7న ఆయా జిల్లాల్లో ఎంపిక కమిటీ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారర
-8న ఎంపికైన అధ్యాపకులు ఈ ఏడాది విద్యాసంవత్సరానికి ఒప్పందం , చేసుకోవలసివుంటుంది
-ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు ఆర్.డేవిడ్కుమార్
- 2 Oct 2020 8:38 AM IST
Antervedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీస్ నిఘా...
తూర్పుగోదావరి..
-రథం దగ్ధంపై సిబిఐ అధికారులు విచారణకు వచ్చేలోపు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీషాసులు
-అమలాపురం డీఎస్పీ మాసూం భాషా ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు
- 2 Oct 2020 8:26 AM IST
Visakha updates: జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం..
విశాఖ...
-పరవాడ మండలం సాలాపువానిపాలేం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం
-ఆటోను డీకొన్న బోలోరా వాహనం ఇద్దరికి తీవ్రగాయాలు
-అనకాపల్లి ఆసుపత్రికి తరలింపు











