Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Sep 2020 7:23 AM GMT
Jangaon district updates:పాలకుర్తి మండలం కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంబులెన్సును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ..
జనగామ జిల్లా..
-పాలకుర్తి మండలం కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంబులెన్సును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అప్పగించారు.
- 1 Sep 2020 7:17 AM GMT
Mahabubabad district updates: తొర్రూర్ డివిజన్ కేంద్రంలోమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ శాఖ..
మహబూబాబాద్ జిల్లా..
-తొర్రూర్ డివిజన్ కేంద్రంలోమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ శాఖ..
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్సును ప్రారంభించి తొర్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అప్పగించారు.
- 1 Sep 2020 5:08 AM GMT
Khammam district updates: హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో కిందిస్థాయి సిబ్బంది ఇష్టా రాజ్యం..
ఖమ్మం....
-ఖమ్మం హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో కిందిస్థాయి సిబ్బంది ఇష్టా రాజ్యం..
-మార్కెట్ సిబ్బంది అక్రమ వసూళ్ళు భరించలేక గేటు ముందు వాహనాలు అడ్డుపెట్టి ధర్నాకు దిగిన వాహనదారులు..
-కూరగాయలు మార్కెట్లో వాహనా దారులనుండి సెజ్ పేరుతో అక్రమ వసూళ్ళు..
-గడిచిన పదిరోజుల్లో పలు మార్లు రేట్లు పెంపు..
-వాహనాలు బట్టి ఒక్కొరేటు వసూళ్ళు...మార్కెట్ బిల్ ఇస్తే ఓరేటు...లేకుంటే మరో రేట్..
-వాహన దారులకు బిల్ ఇవ్వకుండానే వసూళ్ళు చేస్తున్న సిబ్బంది..
-మార్కెట్ కమిటీ చెర్మెన్ రమణ హామీతో ధర్నా విరమించిన వాహనదారులు..
- 1 Sep 2020 5:01 AM GMT
Telangana Corona updates: తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల..
-తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల..
-గడిచిన 24 గంటల్లో 2734 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు
-మొత్తం ఇప్పటి రాష్ట్రంలో 1 27 697 కొరొనా కేసులు నమోదు
-కొత్తగా 9 మరణాలు 836 కి చేరిన మరణాల సంఖ్య
-మొత్తం ఆక్టీవ్ కేసులు 31 699 కొరొనా కేసులు
-గడిచిన 24 గంటల్లో 38 351 శాంపిల్స్ కలెక్ట్ చేయగా 878 పెండింగ్ లో ఉన్నాయి
- 1 Sep 2020 4:59 AM GMT
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద....
నిజామాబాద్....
-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
-ఇన్ ఫ్లో 18650 వేల క్యుసెక్కులు
-ఔట్ ఫ్లో 6636 క్యూసెక్కుల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
-ప్రస్తుత నీటి మట్టం 1089.8 అడుగులు
-నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
-ప్రస్తుతం 83.772 టిఎంసీలు
- 1 Sep 2020 4:56 AM GMT
Jayashankar Bhupalpally updates: కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
-మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి
-స్నాన ఘట్టాల వద్ద 32వ మెట్టు పైకి చేరిన వరద.
-11.87 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి నది.
-నిండుకుండను తలపిస్తున్న గోదావరి.
- 1 Sep 2020 3:37 AM GMT
Telangana latest updates: నేడు గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ అలర్ట్....
-నేడు గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ అలర్ట్....
-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు...
-కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపు కోవాలని సూచించిన పోలీస్ శాఖ..
-నిబంధనలు ఉల్లగిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవు అంటున్న పోలీసులు..
-మూడు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ల ద్వారా నిమాజ్జన వేడుకల్ని పరీశీలించనున్న అధికారులు..
-నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచిన పోలీసులు..
-హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు.
-భక్తులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు,పోలీసులకు సహకరించాలంటున్న పోలీసులు.
- 1 Sep 2020 1:53 AM GMT
Hyderabad Latest News: బాలాపూర్ గణేష్ లడ్డు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది..
-బాలాపూర్ గణేష్ లడ్డు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది..
-ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఊర్లో ఊరేగింపు జరుపుతున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
-ఈ సంవత్సరం కరోనా కారణంగా లడ్డు వేలం పాట వెయ్యని సభ్యులు
-ఉచితంగా లడ్డు ని పంపిణీ చేస్తామంటున్న ఉత్సవ కమిటీ సభ్యులు
-బాలాపూర్ గణేష్ నిమార్జనానికి, దర్శనానికి భక్తులని అనుమతించని పోలీసులు
- 1 Sep 2020 1:21 AM GMT
Nizamabad updates: నేడు నగరం లో గణేష్ నిమజ్జనం.
నిజామాబాద్ :
-నేడు నగరం లో గణేష్ నిమజ్జనం.
-నగర పాలక సంస్థ తరపున ఏర్పాట్లు.
-దుబ్బ ప్రాంతం నుంచి ప్రధాన వీధుల మీదుగా వినాయకుల బావి వరకు కొనసాగనున్న గణేష్ శోభాయాత్ర
-గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్.
- 1 Sep 2020 1:18 AM GMT
Nizamabad updates: నేటి నుంచి డిజిటల్ తరగతుల నిర్వహణ కు విద్యాశాఖ ఏర్పాట్లు..
నిజామాబాద్ :
-నేటి నుంచి డిజిటల్ తరగతుల నిర్వహణ కు విద్యాశాఖ ఏర్పాట్లు..
-1 నుంచి 14 తేదీ వరకు పాఠ్య ప్రణాళిక ను విడుదల చేసిన అధికారులు.
-మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు పాఠాలు వినేలా ఏర్పాట్లు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire