Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha updates: వైసీపీ లో చేరేందుకు టీడీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నాహాలు..
    1 Oct 2020 12:10 PM GMT

    Visakha updates: వైసీపీ లో చేరేందుకు టీడీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నాహాలు..

    విశాఖ..

    - అక్టోబర్ 3 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గంటా కలిసే అవకాశం

    - తన కుమారుడు రవితేజ ను వెంటబెట్టుకొని జగన్ వద్దకు వెళ్ళే ఛాన్స్

    - మరో వైపు అదే రోజు తాడేపల్లికి రావాలని గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కె కె రాజు కు అధిష్టానం పిలుపు

    - వైసీపీ లో చేరేందుకే గంటా ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారని ప్రచారం

    - గత కొద్దికాలంగా వైసీపీ లో చేరేందుకు గంటా ప్రయత్నాలు

    - గంటా రాకను వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్థారించని గంటా వర్గం

  • Amaravati updates: జువనైల్ జస్టిస్ యాక్ట్ కొన్ని చోట్ల సరిగా అమలుకావడం లేదు..
    1 Oct 2020 6:35 AM GMT

    Amaravati updates: జువనైల్ జస్టిస్ యాక్ట్ కొన్ని చోట్ల సరిగా అమలుకావడం లేదు..

    అమరావతి..

    జస్టిస్ కె.విజయలక్ష్మి

    -హైకోర్టు జువనైల్ జస్టిస్ కమిటీ మెంబర్ గా కొన్ని ఇంకా మార్పు జరగాల్సి ఉందని గమనించాం

    -సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపిన దాని ప్రకారం పిల్లల మానసిక పరిస్ధితి తెలుసుకోవాలి

    -పోలీసులు, ప్రభుత్వంలోని పలు శాఖలు చాలా బాధ్యతతో జువనైల్ జస్టిస్ కోసం పనిచేస్తున్నారు

    -కొన్ని సంస్ధలు ఇంకా జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిజిష్టర్ కాలేదు

    -పిల్లలను కుటుంబ వాతావరణంలో ఉంచేలా జువనైల్ హోమ్స్ ఉండాలి

    -పిల్లలకు అభద్రత, అసౌకర్యం కలగకుండా ఉండాలి

    -ప్రతీ బాలబాలికలకు కూడా అన్ని విషయాలలో పాల్గొనే హక్కు ఉంటుంది

    -ఏ కుటుంబం నుంచీ వచ్చారో ఆ కుటుంబంలో తిరిగి కలిసేలా జువనైల్ జస్టిస్ యాక్ట్ మాలు ఉండాలి

    -అనాధ పిల్లలను దత్తత చేయడానికి కూడా అవకాశాలు కల్పించాలి

    -సైకాలజిష్టు, సైకియాట్రిష్ట్ ద్వారా వారికి మానసిక స్ధైర్యం కల్పించాలి

    -ప్రతీనెలా కచ్చితంగా జువనైల్ హోమ్స్ పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి

    -జువనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 39 ప్రకారం రక్తబంధం ఉన్న పిల్లలు ఒకే దగ్గర ఉంచబడాలి

    -నేరం చేసినట్లుగా చెపుతున్న పిల్లలు కూడా మామూలు పిల్లలుగానే భావించి చూడబడాలి

    -నేరం ఆపాదించబడిన పిల్లలను నేరస్ధులుగా చూడకూడదు

  • Kurnool rain updates: కోడుమూరు ,గూడూరు ,సి.బెళగల్ మండలాల్లో భారీ వర్షం..
    1 Oct 2020 6:28 AM GMT

    Kurnool rain updates: కోడుమూరు ,గూడూరు ,సి.బెళగల్ మండలాల్లో భారీ వర్షం..

    కర్నూల్:

    -కోడుమూరు, ఎమ్మిగనూరు రహదారిపై వర్కూరు వద్ద ఉప్పొంగిన తుమ్మల వాగు..

    -పొంగి పారుతున్న మొండికట్టల వాగు

    -తమ్మలవాగు దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుంచి నిలిచిన వాహనాల రాకపోకలు

  • APSRTC updates: ఆర్టీసీ బస్సులలో భౌతికదూరం నిబంధనలు తొలగింపు..
    1 Oct 2020 6:26 AM GMT

    APSRTC updates: ఆర్టీసీ బస్సులలో భౌతికదూరం నిబంధనలు తొలగింపు..

    తూర్పుగోదావరి..రాజమండ్రి: 

    -జిల్లాలో బస్సులలో గతంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన సీట్లను పూర్తిగా పాత సీటింగ్ గా మార్పు

    -నేటినుంచి రాజమండ్రి- నుంచి విశాఖకు ఏసీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

  • Kurnool updates: ఉలిందకొండ జాతీయ రహదారి పై పొలాల్లోంచి వస్తున్న వర్షం నీరు..
    1 Oct 2020 6:24 AM GMT

    Kurnool updates: ఉలిందకొండ జాతీయ రహదారి పై పొలాల్లోంచి వస్తున్న వర్షం నీరు..

    కర్నూలు జిల్లా: 

    -రాత్రి కురిసిన భారీ వర్షాలకు జాతీయరహదారిపై పొంగిపొర్లుతున్నా వర్షము నీరు

    -రాక పోకలకు అంతరాయం,పలు కార్ల శైలేంజర్ లోకి నీరు పోవడం తో ఆగి పోయిన కార్లు

    -కార్లు ఆగిపోవడంతో అగచాట్లు పడుతున్న కారు యజమానులు

  • Vijayawada updates: జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల  పంపిణీ కార్యక్రమం!
    1 Oct 2020 5:01 AM GMT

    Vijayawada updates: జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం!

    కృష్ణాజిల్లా..

    -జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం

    -అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకే 40 శాతం వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ పూర్తి

    -లబ్ధిదారుల వద్దకే వెళ్లి పంపిణీ చేసిన వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు

  • Amaravati updates: రాష్ట్రంలో బాల నేరస్థులు పెరిగే విషయంలో డీజీపీ వర్క్ షాప్..
    1 Oct 2020 4:59 AM GMT

    Amaravati updates: రాష్ట్రంలో బాల నేరస్థులు పెరిగే విషయంలో డీజీపీ వర్క్ షాప్..

    అమరావతి..

    -డిజిపి గౌతమ్ సవాంగ్ కామెంట్స్

    -రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే అంశాల పై డీజీపీ వర్క్ షాప్

    -ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికల విషయంలో ముందుగా పోలీసులకు తెలపాలి

    -పోలీసులకు జిల్లా వ్యాప్తంగా ఒంటరి బాలురు, బాలికలు వివరాలు తెలియపరచాలి

    -www.trackthemissingchild.gov.in వెబ్సైట్ లో ప్రజల ఎవరైనా బాలురు, బాలికలు వివరాలు తెలియచేయొచ్చు

    -వెబ్సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయిన వారి వివారులతో సరి తుగితే సదరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి

    -ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదు

    -ఒకవేళ బాలురు, బాలికలు నేరం చేస్తే, వారిని స్టేషనలో నేరస్థులతో ఉంచకుండా, వారితో మృదువుగా వ్యవహరించాలి

  • Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
    1 Oct 2020 4:53 AM GMT

    Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

    కర్నూలు జిల్లా....

    -6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

    -ఇన్ ఫ్లో : 1,93,643 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో : 2,07688 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    -ప్రస్తుతం : 884.70 అడుగులు

    -పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    -ప్రస్తుతం: 213.8824 టీఎంసీలు

    -కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • Amaravati updates: పిల్లల భద్రత చట్టం అమలుపై డిజిపి కార్యాలయంలో రెండో రోజు వర్క్ షాపు..
    1 Oct 2020 3:36 AM GMT

    Amaravati updates: పిల్లల భద్రత చట్టం అమలుపై డిజిపి కార్యాలయంలో రెండో రోజు వర్క్ షాపు..

    అమరావతి:

    -ఇవాళ జ్యూమ్ యాప్ ద్వారా ‌పాల్గొననున్న సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు

    -నేరుగా పాల్గొననున్న‌ డిజిపి గౌతమ్ సవాంగ్, సిఐడి చీఫ్ సునీల్ ‌కుమార్

    -పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం

  • Amaravati updates: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రక్రియ..
    1 Oct 2020 3:34 AM GMT

    Amaravati updates: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రక్రియ..

    అమరావతి:

    -61.65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,497.88 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

    -లబ్ధిదారుల చేతికే పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు..

    -కొత్తగా ఈనెల 34,907 మందికి పెన్షన్లు..

Print Article
Next Story
More Stories