
WHO హెచ్చరిక.. గుండె జబ్బులకి ప్రధాన కారణం ఇదే..!
WHO Warning: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల (500 కోట్లు) ప్రజలు ట్రాన్స్-ఫ్యాట్ భారినపడ్డారు.
WHO Warning: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల (500 కోట్లు) ప్రజలు ట్రాన్స్-ఫ్యాట్ భారినపడ్డారు. ఇది గుండె జబ్బులకి కారణమవుతూ మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. ట్రాన్స్-ఫ్యాట్ అనేది అసంతృప్త కొవ్వు రకం. ఇది సహజ, కృత్రిమ రూపాల్లో వస్తుంది. సాధారణంగా ప్యాక్ చేసిన ఆహారాలు, కాల్చిన ఆహారాలు, వంట నూనెలలో ఎక్కువగా ఉంటుంది.
WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ట్రాన్స్-ఫ్యాట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సరళంగా చెప్పాలంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది విషపూరితమైన రసాయనం. ఇది మానవులను నెమ్మదిగా చంపుతుంది. అందుకే ఆహారం నుంచి దానిని వదిలించుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య ప్రమాదం పొంచి ఉంది. .
WHO 2018లోనే 2023 నాటికి ప్రపంచం నుంచి ట్రాన్స్ ఫ్యాట్ను తొలగించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 43 దేశాలు ట్రాన్స్-ఫ్యాట్లను ఎదుర్కోవడానికి ఉత్తమ-ఆచరణ విధానాలను అమలు చేస్తున్నాయి. దాదాపు 2.8 బిలియన్ల ప్రజలను రక్షించాయి. అయితే ఐదు బిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ ఈ అసంతృప్త కొవ్వు ప్రభావాలతో బాధపడుతున్నారు.
గుండె జబ్బులు,ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా మరణాలు ఎక్కువగా ఉన్న 16 దేశాలలో 9 దేశాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని WHO తెలిపింది. ఈ 9 దేశాల్లో ఆస్ట్రేలియా, అజర్బైజాన్, భూటాన్, ఈక్వెడార్, ఈజిప్ట్, ఇరాన్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని WHO సూచించింది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire