Viral Video: మండుతున్న మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం చేసిందంటే?

Viral Video: మండుతున్న మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం చేసిందంటే?
x
Highlights

ఖమ్మం జిల్లా పేరువంచలో గడ్డివాము అంటుకోగా, లోపల ఉన్న నాగుపాము బయటకు వచ్చి అందరినీ భయపెట్టింది. మంటల వైపు చూస్తూ పడగ విప్పి గంటసేపు బుసలు కొట్టిన ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖమ్మం జిల్లాలో ప్రకృతి వైపరీత్యమో లేక విధి విచిత్రమో కానీ, ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పొలంలో గడ్డివాము తగలబడుతుంటే, మంటల వేడిని తట్టుకోలేక ఒక భారీ నాగుపాము బయటకు వచ్చింది. అయితే, ప్రాణభయంతో పారిపోకుండా ఆ పాము చేసిన పని చూసి స్థానిక రైతులు, జనం నివ్వెరపోయారు.

అసలేం జరిగింది?

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది. ఒక రైతు తన పశువుల కోసం పొలంలో పెద్ద గడ్డివామును పేర్చాడు. అయితే, గురువారం ప్రమాదవశాత్తు ఆ గడ్డివాముకు నిప్పు అంటుకుంది. మంటలు ఎగసిపడుతుండటంతో రైతులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటల వైపు చూస్తూ గంటసేపు బుసలు!

మంటలు తీవ్రమవుతున్న సమయంలో గడ్డివాము లోపల నివాసం ఉంటున్న ఒక భారీ నాగుపాము బయటకు వచ్చింది. సాధారణంగా మంటలను చూస్తే మూగజీవాలు భయంతో పారిపోతాయి. కానీ, ఈ నాగుపాము మాత్రం పడగవిప్పి, మంటల వైపు చూస్తూ సుమారు గంటసేపు అక్కడే బుసలు కొడుతూ ఉండిపోయింది. ఆ దృశ్యం చూసిన రైతులకు వెన్నులో వణుకు పుట్టింది.

పిల్లల కోసమేనా ఆ ఆవేదన?

అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:

"తగలబడుతున్న గడ్డివాములో ఆ పాము పిల్లలు లేదా జత పాము ఉండి ఉండవచ్చు.. అందుకే అది అంత ఆవేదనతో, కోపంతో మంటల వైపు చూస్తోంది" అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

తన నివాసం కళ్లముందే కాలిపోతుంటే ఆ పాము పగ పట్టినట్లుగా చూస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి మంటల్లోంచి బయటకొచ్చిన ఈ 'నాగరాజు' ఉదంతం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories