Kidney Stones : టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు పడతాయా.. నిపుణులు ఏమంటున్నారంటే ?

ఈ రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఈ సమస్య గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది టొమాటోలు తినడం మానేస్తారు.

CR Reddy
Published on: 6 Dec 2025 12:00 PM IST
Kidney Stones : టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు పడతాయా.. నిపుణులు ఏమంటున్నారంటే ?
X

Kidney Stones : టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు పడతాయా.. నిపుణులు ఏమంటున్నారంటే ?

Kidney Stones : ఈ రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఈ సమస్య గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది టొమాటోలు తినడం మానేస్తారు. ఎందుకంటే టమాటాలను ఎక్కువగా తింటే లేదా ఆహారంలో నిత్యం వాడితే కిడ్నీ స్టోన్స్ వస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఒకసారి కిడ్నీ స్టోన్ వస్తే, చాలా మంది టమాటాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అయితే ఇది నిజమేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

టమాటాల్లో ఆక్సలేట్ ఎంత ఉంటుంది?

టమాటాలు తినడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్య వస్తుందనే వాదనను ఆరోగ్య నిపుణులు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. సాధారణంగా టమాటాలలో ఉండే ఆక్సలేట్ అనే పదార్థం మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని ప్రజలు అనుకుంటారు. కానీ ఈ కూరగాయలో ఆక్సలేట్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. నిపుణుల ప్రకారం 100 గ్రాముల టమాటా కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ఇంత తక్కువ ఆక్సలేట్ సరిపోదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కిడ్నీ స్టోన్స్‌కు అసలు కారణాలు ఇవే

కిడ్నీ స్టోన్స్‌కు ప్రధాన కారణం నిర్జలీకరణం అని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పని చేసేవారైనా సరే, ప్రతిరోజూ కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఇతర కారణాలు:

ఎంజైమ్‌ల లోపం లేదా జీవక్రియ సమస్యలు: కొన్ని ఎంజైమ్‌ల లోపం లేదా జీవక్రియ సమస్యల వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు.

ఆక్సలోసిస్ : ఇది చాలా అరుదైన జీవక్రియ రుగ్మత. దీని కారణంగా మూత్రపిండాలు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు పంపడం ఆగిపోతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు.

ఇతర రకాల స్ఫటికాలు: కొన్నిసార్లు కాల్షియం ఆక్సలేట్‌తో పాటు యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ క్యాల్కులై, సిస్టీన్ క్యాల్కులై వంటి ఇతర స్ఫటికాలతో కూడా రాళ్లు ఏర్పడవచ్చు.

మాంసాహారం: కొన్ని రకాల మాంసాహారం తినడం వల్ల కిడ్నీ స్టోన్ ప్రమాదం పెరుగుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ, అది పూర్తిగా నిజం కాదు.

మూత్రపిండాల సమస్యలు, డయాబెటిస్ లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు, తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే, ఈ విషయంలో ఆహారం కంటే వైద్యుల సలహా, మందులు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎప్పుడైనా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

CR Reddy

CR Reddy

Next Story