మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే!

మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే!
x
Highlights

మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తున్నాయి.

కాలుష్య నియంత్రంలో భాగంగా భవిష్యత్ లో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకురావాలని పలు కంపెనీ యోచిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తున్నాయి. స్టార్టప్ కంపెనీ అయిన వన్ ఎలక్ట్రిక్ 'కేఆర్ఐడిఎన్' Kridn ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. సంస్కృతంలో కేఆర్ఐడిఎన్ అంటే 'ఆడటం' అని అర్థం. ప్రస్తుతంహైదరాబాద్, బెంగళూరులో అందుబాటులోకి తీసుకురానుంది. ఇక వచ్చే ఏడాది (2021) జనవరి చివరి నాటికీ తమిళనాడు, కేరళలో తమ వాహనాలు లాంచ్ చేయనున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్‌సిఆర్లలో దశల వారీగా డెలివరీలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

'కేఆర్ఐడిఎన్' తెలిపిన వివరాల ప్రకారం ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 95 కెఎంపిహెచ్. ఇది 5.5 కిలోవాట్ లేదా 7.4 బీహెచ్ పీతో వస్తుంది. ఈ బైక్ 240 మిమీ డిస్క్, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్ తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ధర 1.29 లక్షలు(ఎక్స్-షోరూమ్) అని తెలిపింది. వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా సమీప భావిష్యత్ లో తమ వాహనాలు మరిన్ని అందుబాటులోకి తీసురావాలని నిర్ణయించింది. ఇందులో 80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్ కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ మోడ్‌లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైకుకు డిజిటల్ ఓడోమీటర్‌తో పాటు జి‌పి‌ఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories