Health Tips: రోజంతా లాప్‌ట్యాప్ ముందు కూర్చుంటారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ డిజిటల్ యుగంలో మొబైల్, కంప్యూటర్‌ల అధిక వినియోగం కారణంగా కళ్ళు, మెడ, చేతి మణికట్టు వంటి భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆర్థోపెడిక్ సర్జన్ డా. హేమంత్‌కుమార్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

Ramya Vegirouthu
Updated on: 18 July 2025 8:16 PM IST
Health Tips: రోజంతా లాప్‌ట్యాప్ ముందు కూర్చుంటారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు
X

Health Tips: రోజంతా లాప్‌ట్యాప్ ముందు కూర్చుంటారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ డిజిటల్ యుగంలో మొబైల్, కంప్యూటర్‌ల అధిక వినియోగం కారణంగా కళ్ళు, మెడ, చేతి మణికట్టు వంటి భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆర్థోపెడిక్ సర్జన్ డా. హేమంత్‌కుమార్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

నేటి రోజుల్లో, ఉద్యోగం కావచ్చు లేదా ఇంటి పనులే కావచ్చు, ఎక్కువ పనులు స్క్రీన్‌లపైనే జరుగుతున్నాయి. దీర్ఘకాలం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కళ్ళలో మసకదృష్టి, మెడ నొప్పి, చేతి మణికట్టు నొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.

యువతలోనే సమస్యలు పెరుగుతున్నాయి

డా. హేమంత్‌కుమార్ ప్రకారం, ఇంతకుముందు 50-60 ఏళ్ల వయసులో కనిపించే ఈ సమస్యలు, ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఎక్కువసేపు లాప్‌ట్యాప్ ముందు కూర్చోవడం వల్ల ఈ సమస్యలకు గురవుతున్నారు.

పిల్లల ఆరోగ్యానికి కూడా ప్రమాదం

డా. హేమంత్‌కుమార్ మాట్లాడుతూ, "చిన్న పిల్లలకు మొబైల్, టాబ్లెట్ ఇవ్వడం పెద్ద తప్పు. తల్లిదండ్రులు సౌలభ్యం కోసం పిల్లలకు ఎక్కువసేపు స్క్రీన్ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే కళ్ళు ఒత్తిడికి గురై, భవిష్యత్తులో తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక ఎదుగుదలకు కూడా ఇది మేలు చేయదు" అని చెప్పారు.

డాక్టర్ సూచనల ప్రకారం, స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయడం, ప్రతి 30-40 నిమిషాలకు చిన్న విరామం తీసుకోవడం, కళ్ళకు వ్యాయామాలు చేయడం, సరిగా కూర్చోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story