Health Tips: టెన్షన్ తగ్గాలంటే ఇదొక్కటి తీసుకుంటే చాలు.. 20-25 రూపాయలలో పూర్తి ఉపశమనం..!

Eating Curd Relieves Tension Complete Relief in 20-25 Rupees
x

Health Tips: టెన్షన్ తగ్గాలంటే ఇదొక్కటి తీసుకుంటే చాలు.. 20-25 రూపాయలలో పూర్తి ఉపశమనం..!

Highlights

Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజలు వివిధ కారణాల వల్ల ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజలు వివిధ కారణాల వల్ల ఒత్తిడిని అనుభవిస్తున్నారు. చాలామంది కుటుంబ కలహాలు, డబ్బు లేకపోవడం, ప్రేమ వ్యవహారాలు, ఉద్యోగ సమస్యలు మొదలైన వాటివల్ల డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఇందులో కొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల మందులని వాడుతున్నారు. వాటివల్ల ఎటువంటి ఉపశమనం ఉండదు. ఆయుర్వేద వైద్యనిపుణుల ప్రకారం ఇంట్లో ఉపయోగించే పాల ఉత్పత్తులు తీసుకుంటే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.

పాలు పెరుగు

పాలు, పెరుగు నుంచి తయారైన ఉత్పత్తులు శరీరానికి చాలా ఉపయోగపడుతాయి. పెరుగు తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. వాస్తవానికి ఇది మానవ స్నేహపూర్వక బ్యాక్టీరియా అయిన లాక్టోబాసిల్లస్‌ను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని మైక్రోబయోమ్ పాత్రను మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది నిరాశ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. విషయం ఏంటంటే దీని కోసం పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. 250 గ్రాముల పెరుగు 20 నుంచి 25 రూపాయలకు దొరుకుతుంది.

పెరుగులో లభించే పోషకాలు

పెరుగులో ప్రోటీన్, విటమిన్ B-2, విటమిన్ B-12, కాల్షియం, రైబోఫ్లావిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. పెరుగు వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పెరుగు సాధారణంగా చక్కెర, ఉప్పుతో కలిపి తింటారు. ఈ పాల ఉత్పత్తిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ ఖర్చుకూడా ఉండదు.

పెరుగు టెన్షన్‌ను తొలగిస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. దీనికి మందుల ద్వారా సరైన చికిత్స చేయలేరు. కానీ రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మనస్సు రిలాక్స్‌ అవుతుంది. దీని కోసం ప్రతిరోజూ ఒక గిన్నె పెరుగు సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories