Corneal Blindness : అతి తక్కువ వయసులోనే అంధత్వం.. నిపుణులు తెలిపిన కారణాలివే!

Corneal Blindness : నేటి కాలంలో కళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మొబైల్, టీవీ స్క్రీన్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కళ్ళకు హాని జరుగుతోంది.

CR Reddy
Updated on: 6 Aug 2025 1:30 PM IST
Corneal Blindness : అతి తక్కువ వయసులోనే అంధత్వం.. నిపుణులు తెలిపిన కారణాలివే!
X

Corneal Blindness : అతి తక్కువ వయసులోనే అంధత్వం.. నిపుణులు తెలిపిన కారణాలివే!

Corneal Blindness : నేటి కాలంలో కళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మొబైల్, టీవీ స్క్రీన్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కళ్ళకు హాని జరుగుతోంది. గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించే కార్నియల్ బ్లైండ్‌నెస్ ఇప్పుడు యువకుల్లో కూడా పెరుగుతోంది. 2025లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ సొసైటీ ఆఫ్ కార్నియా అండ్ కెరాటో-రిఫ్రాక్టివ్ సర్జన్స్ సమావేశంలో నిపుణులు ఈ విషయం తెలిపారు. గతంలో ఇది వృద్ధుల సమస్యగా భావించేవారు, కానీ ఇప్పుడు 30 ఏళ్ల లోపు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారని డాక్టర్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం 20,000 నుండి 25,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. కంటికి చిన్న గాయం, ఎర్రబడటం, మంట లేదా ఇన్ఫెక్షన్ వంటివి మొదట్లోనే చికిత్స చేయకపోతే చూపు శాశ్వతంగా పోవచ్చని ఆయన తెలిపారు. చాలా కేసులలో ఈ అంధత్వాన్ని నివారించవచ్చని ఆయన చెప్పారు.

కారణాలు ఇవే!

కంటి గాయాలు: పొలాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే యువకులకు కంటికి గాయాలవడం సాధారణం. అయితే, వారు డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంట్లో ఉండే చిట్కాలను పాటించడంతో ఇన్ఫెక్షన్ పెరిగి అంధత్వం వస్తోంది.

విటమిన్ ఎ లోపం: పిల్లలు, యువకుల్లో విటమిన్ ఎ లోపం కారణంగా కూడా కార్నియల్ బ్లైండ్‌నెస్ వస్తుంది.

అవగాహన లేకపోవడం: గ్రామాల్లో కంటి పరీక్షలు, సరైన సమయంలో చికిత్స, కళ్ళకు సంబంధించిన విషయాలపై అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం.

చికిత్స, నివారణ

భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్‌లు అవసరమవుతాయి, కానీ కేవలం 40,000 మాత్రమే జరుగుతున్నాయి. డోనర్లు లేకపోవడం, మంచి సర్జన్లు, ఐ బ్యాంక్‌లు తగినంతగా లేకపోవడం కూడా దీనికి కారణం. అందుకే, దేశవ్యాప్తంగా కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించడం, యువకులకు రక్షణ పరికరాలను అందించడం చాలా అవసరం. అలాగే, ప్రతి ఒక్కరూ కంటి దానం కోసం ముందుకు రావాలి.

కొన్నిసార్లు చిన్న కంటి సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల చూపు కోల్పోవచ్చు. అందుకే, కంటికి చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. కళ్ళను కాపాడుకోండి.

CR Reddy

CR Reddy

Next Story