శ్రీకాకుళం జిల్లాలో పేలిన నాటుబాంబులు

శ్రీకాకుళం జిల్లాలో పేలిన నాటుబాంబులు
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఎచ్చెర్ల మండలంలోని యాటపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. నాటు బాంబుల పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి....

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఎచ్చెర్ల మండలంలోని యాటపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. నాటు బాంబుల పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యాటపేటలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు ఉంటున్నారు. అడవి పందులను వేటాడేందు నాటు బాంబులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ జరుగుతున్న అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories