కులాంతర ప్రేమ: పెద్దల భయంతో ప్రేమజంట ఆత్మహత్య

కులాంతర ప్రేమ: పెద్దల భయంతో ప్రేమజంట ఆత్మహత్య
x
Highlights

కులాంతర వివాహానికి పెద్దలు ఓప్పుకోరని ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు...

కులాంతర వివాహానికి పెద్దలు ఓప్పుకోరని ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన కొర్రా మోహన్ నాయక్ ఎల్బీనగర్ లో నివాసం ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు... అతడికి రెండేళ్ల క్రితం ఎల్బీనగర్‌ శ్రీనివాసనగర్‌ కాలనీలో ఉండే స్వర్ణలతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో కుటుంబ సభ్యులతో చెప్పేందుకు ధైర్యం చేయలేదు.

ఈ నెల 7న స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చేసింది. అనంతరం ఓ లాడ్జిలో మోహన్‌ నాయక్‌, స్వర్ణలత గది తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందారు. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య చేసుకునట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు స్వర్ణలత ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈ నెల 7న ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీరి కోసం నగరంలో పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. స్వర్ణలత ఫోన్ ట్రాకింగ్ సిగ్నల్స్ ఆధారంగా లాడ్జి ఉనట్లు తెలుసుకున్నారు. అనంతరం లాడ్జికి వెళ్లి తలుపులు తీసి చూడగా వారు విగతజీవులై కనిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories