విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్‌

విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్‌
x
Highlights

విశాఖ నగరంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. భారీగా డబ్బు ఆశ చూపి తీరా పనిపూర్తి కాగానే చేతులు ఎత్తేస్తున్న ముఠాలు...

విశాఖ నగరంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. భారీగా డబ్బు ఆశ చూపి తీరా పనిపూర్తి కాగానే చేతులు ఎత్తేస్తున్న ముఠాలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. తాజా హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి అనే వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించి ఓ ముఠా మోసం చేసింది. 12 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న ముఠా బాధితుడికి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.

ఈ కిడ్నీ రాకెట్ లో కీలక సూత్రధారి బెంగళూరుకు చెందిన దళారీ మంజునాథ్ కీలక పాత్ర పోషించాడు. డబ్బులకు ఆశపడిన శ్రద్ధ ఆస్పత్రి వైద్యులు బెంగళూరుకు చెందిన పెషెంట్ ప్రభాకర్‌కు కిడ్నీఅమర్చారు. ఈ కేసులో ఏ1గా మంజునాథ్‌, ఏ2గా పేషెంట్‌ ప్రభాకర్‌, ఏ3గా శ్రద్ధ హాస్పిటల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, ఏ4గా వెంకటేశ్‌‌‌ను నమోదు చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆరోగ్యాన్ని పనంగా పెట్టిమరీ కిడ్నీ అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు మోసపోయి ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పటికైనా ఇలాంటి కిడ్నీ దళారులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories