కూకట్‌పల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణ ..మహిళకు గాయాలు

కూకట్‌పల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణ ..మహిళకు గాయాలు
x
Highlights

కూకట్‌పల్లిలో రెండు వర్గాల విద్యార్ధులకు మధ్య జరిగిన ఘర్షన కలకలం సృష్టించింది. కేపీహెచ్‌బీ కాలనీలో నడిరోడ్డుపై రెండు వర్గాలకు చెందిన విద్యార్ధులు...

కూకట్‌పల్లిలో రెండు వర్గాల విద్యార్ధులకు మధ్య జరిగిన ఘర్షన కలకలం సృష్టించింది. కేపీహెచ్‌బీ కాలనీలో నడిరోడ్డుపై రెండు వర్గాలకు చెందిన విద్యార్ధులు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఫార్చ్యూన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్‌ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్ధులు ఘర్షణ కారణంగా స్థానికులు భయాందోళకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా అటునుండి నడుచుకుంటూ వెళ్లిన ఓ మహిళకు గాయాలయ్యాయి. అయితే గాయపడిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అసలు విద్యార్థులు ఎందుకు కొట్టుకుంటున్నారనే విషయం తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories