కుప్పకూలిన భారీ క్రేన్లు

cranes
x
cranes
Highlights

కాకినాడ సీ పోర్టులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.

కాకినాడ సీ పోర్టులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కె.ఎస్.పి.ఎల్‌లోని 6వ నెంబరు బెర్త్‌పై పాత క్రేన్ రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీప్ వాటర్ పోర్టు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సర్పవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ క్రేన్లు కుప్పకూలిపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories