పవన్ ఓటమి భాదించింది .. మాధవిలత

పవన్ ఓటమి భాదించింది .. మాధవిలత
x
Highlights

తన ఓటమి గురించి తనకు ముందే తెలుసనని కానీ పవన్ ఓటమి తనని భాదించింది అన్నారు సినీనటి మాధవిలత .. ఆమె ఈ ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి...

తన ఓటమి గురించి తనకు ముందే తెలుసనని కానీ పవన్ ఓటమి తనని భాదించింది అన్నారు సినీనటి మాధవిలత .. ఆమె ఈ ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటి చేసారు ఆమె .. 1989 ఓట్లు మాత్రమే పోలవడంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు. ఓటమి అనంతరం నటి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.

తన ఓటమిని ముందే ఊహించానని పేర్కొన్న మాధవీలత.. పవన్ ఓటమి మాత్రం తనను బాధించిందని పేర్కొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నానని, జరిగిందని అన్నారు. అయితే, పవన్ కల్యాణ్ ఓటమే తనకు విడ్డూరంగా అనిపించిందన్నారు.

పవన్‌ను ఓడించి తమకు నిజాయతీపరులు అవసరం లేదని భలే తీర్పు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకే పట్టం కట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ డబ్బులు ఇవ్వకున్నా మోదీ ప్రేమతో ఓట్లు సంపాదించారని అన్నారు. పవన్ ఎందుకు గెలవలేదని, ఆయన అభిమానులకు ఏమైందని ప్రశ్నించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories