Revanth Reddy: సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ తోడు దొంగలు

Revanth Reddy: పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి

Rama Rao
Updated on: 8 April 2022 11:29 AM IST
TPCC Chief Revanth Reddy Comments On CM KCR And PM Narendra Modi
X

Revanth Reddy: సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ తోడు దొంగలు 

Revanth Reddy: కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోడీ ఇద్దరు ముమ్మాటికీ తోడు దొంగలేనని రేవంత్ ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ధర్నాలకు అనుమతిస్తున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతించరో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. రేవంత్ ఇంటి నుంచి విద్యుత్ సౌధ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయల్దేరారు.

Rama Rao

Rama Rao

Next Story