క‌రోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియ సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియ సంచ‌ల‌న నిర్ణ‌యం
x
Highlights

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను...

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్నట్లు ప్రకటించింది. కరోనా మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మూసివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. రమజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రమజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories