అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
x
అమెరికలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
Highlights

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మణం పాలయ్యారు. టెక్సాస్ రాష్ర్టం ప్రిస్కో పట్టణంలో ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న...

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు దుర్మణం పాలయ్యారు. టెక్సాస్ రాష్ర్టం ప్రిస్కో పట్టణంలో ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు భారతీయులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో దివ్య ఆవుల, రాజా గవిని, ప్రేమ్ నాథ్ రామనాథం అక్కడికక్కడే మృతి చెందారు.

ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ దగ్గర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన రామనాథం, ఆవుల దివ్య, రాజా గవిని ఫ్రిస్కోలో నివసిస్తున్నారు. ఆవుల దివ్య కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories