పాకిస్తాన్ మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనావైరస్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనావైరస్
x
Highlights

పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ లకు సోమవారం కరోనావైరస్ పరీక్షలు చేశారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ లకు సోమవారం కరోనావైరస్ పరీక్షలు చేశారు. దీంతో ఇద్దరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.. 61 ఏళ్ల షాహిద్ అబ్బాసికి వైరస్ సోకినట్లు ఆయన స్పష్టం చేశారు.

అవినీతి కేసులో ప్రధాని పదవిని కోల్పోయారు నవాజ్ షరీఫ్.. ‌ ఆ తరువాత పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అబ్బాసి ప్రధాని పీఠం అధిరోహించారు.. 2017 ఆగస్టు నుండి 2018 మే వరకు ప్రధానిగా పనిచేశారు. సోమవారం ఆయనకు COVID-19 పాజిటివ్ అని తేలిన తరువాత ఇంట్లో స్వీయ-నిర్బంధంలో పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కు కూడా కరోనావైరస్ సోకిందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories