Imran Khan: 15 తరువాత లాక్ డౌన్ ను పెంచే యోచనలో పాక్..

Imran Khan: 15 తరువాత లాక్ డౌన్ ను పెంచే యోచనలో పాక్..
x
PM of Pakistan, Imran Khan
Highlights

పాకిస్థాన్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.

పాకిస్థాన్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పౌర , సైనిక నాయకత్వంతో కూడిన పాకిస్తాన్ కమాండ్ అండ్ కంట్రోల్ అథారిటీ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ఏప్రిల్ 15న తరువాత కూడా విస్తరించాలా? వద్దా అనే విషయంపై చర్చించినట్లు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు న్యూస్ ఏజన్సీ రాయిటర్స్ కు చెప్పారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాకిస్థాన్.. మరో 10 రోజులు లేదా కొన్ని వారాల పాటు లాక్ డౌన్ పొడిగించబోతుందని చెప్పారు. అంతేకాదు ఈ సమావేశంలో వైరస్ హాట్ స్పాట్‌లను మూసివేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.

అలాగే ఈ సమావేశం అనంతరం కొన్ని పరిశ్రమలను, ముఖ్యంగా నిర్మాణ మరియు ఎగుమతి రంగాలను తిరిగి తెరిచే దశల వారీ ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. కాగా పాకిస్తాన్ లో మొత్తం 5,374 వైరస్ కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకూ 93 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories