పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 107 మంది మృతి?

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 107 మంది మృతి?
x
Highlights

పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం కరాచీ సమీపంలోని...

పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానం కరాచీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలుంది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో 107 మందిపైగా ప్రయాణికులు ఉన్నట్టు రేడియో పాకిస్తాన్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. విమాన సిబ్బంది మరో ఎనిమిది మంది ఉన్నట్టు తెలుస్తోంది. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు, పొగలు వచ్చాయి. ఎయిర్‌బస్ 320 మోడల్‌కు సంబంధించిన ఫ్లైట్ నంబర్ పీకే 8303… కరాచీ విమానాశ్రయం సమీపంలోని నివాసాల్లోకి దూసుకెళ్లినట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే విమానం ప్రమాదం జరిగిన స్థలం మోడల్ కాలనీ ఎక్కువగా పేదల నివసించే ప్రాంతం కావడం, ఎక్కువగా జనసాంద్రత ఉండే ప్రాంతం కావడం ఘటనపై ఆందోళన మరింత ఎక్కువైంది. ప్రమదం జరిగిన వెంటనే పోలీసులు, మిలిటరీ ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఈ ఘటనపై స్పందించాడు. విమానం కూలిపోవడానికి ముందు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు... ప్రయత్నించిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి విమానంలోని వాళ్లెవరూ.. సజీవంగా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories