అప్పుడు గాడిదెక్కాడు...ఇప్పుడు రాజయ్యాడు

అప్పుడు గాడిదెక్కాడు...ఇప్పుడు రాజయ్యాడు
x
Highlights

వార్తలు చదవడమన్నా, వార్తలు చెప్పడమన్నా అది ఒక ప్యాషన్. ఇక ఆ వార్తలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే క్రియేటివిటీ వెతుక్కుంటున్నారు నేటి రిపోర్టర్లు. ఒక...

వార్తలు చదవడమన్నా, వార్తలు చెప్పడమన్నా అది ఒక ప్యాషన్. ఇక ఆ వార్తలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే క్రియేటివిటీ వెతుక్కుంటున్నారు నేటి రిపోర్టర్లు. ఒక వార్తను ఎంత కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే అంత ఫేమ్ అవుతుందని ఆలోచిస్తున్నారు. కొన్ని కొన్ని స్పెషల్ వార్తలను స్పెషల్ ఎఫెక్ట్ లతో చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే తరహాలో ఇటీవల నటి శ్రీదేవి చనిపోయిన తరువాత కొంతమంది కొత్త రిపోర్టర్లు ఏకంగా బాత్ టబ్‌లో పడుకుని మరీ శ్రీదేవి ఎలా చనిపోయిందని రిపోర్టింగ్ చేశారు. వానొచ్చినా, వరదొచ్చినా, చలేసినా, ఎండ కొట్టినా ప్రతి దాన్ని సెన్సేషన్ చేయడానికి చూస్తున్నారు.

ఇదే తరహాలో మన పక్క దేశం పాకిస్తాన్ లో ఓ రిపోర్టన్ తనదైన శైలిలో రిపోర్టింగ్ చేసారు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల ఫోన్లలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్లు మాత్రం కడుపుబ్బా నవ్వించే కమెంట్లను పోస్ట్ చేస్తున్నారు. అసలు విషయమేంటి అనుకుంటున్నారా.

పాకిస్తాన్ లోని ఓ ప్రముఖ‌ చానెల్లో రిపోర్టర్ గా పనిచేస్తున్న అమీన్ హఫీజ్ ఓ చారిత్రక కట్టడం గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. సాధారణ దుస్తుల్లో రిపోర్టింగ్ చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఏకంగా రాజు వేశం వేసుకుని సీన్ లోకి దిగాడు. రాజులా దుస్తులను ధరించడమే కాదు చేతిలో మైక్ కి బదులు కత్తి పట్టుకుని రిపోర్టింగ్ చేశాడు.

ఇతను ఇలా చేయడం ఇదేం మొదటి సారి కాదు. ఇదివరకు గాడిదల బ్రీడింగ్ గురించి చెప్పేందుకు ఏకంగా గాడిదపై కూర్చొని రిపోర్టింగ్ చేసాడు. అప్పుడు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడేమో రాజులా అవతారం ఎత్తాడు. ఇక ముందు ముందు ఎన్ని వేశధారణల్లో ప్రజల ముందు రిపోర్టింగ్ చేస్తారో చూడాల్సిందే.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories