India-China Direct Flights: భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం

India-China Direct Flights: ఐదేళ్ల తర్వాత భారత్‌- చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

Arun Chilukuri
Published on: 27 Oct 2025 2:30 PM IST
India-China Direct Flights: భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం
X

India-China Direct Flights: ఐదేళ్ల తర్వాత భారత్‌- చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ విమానం 176 మంది ప్రయాణికులతో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు బయల్దేరింది. 2020 మార్చి వరకు రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిచాయి.

కొవిడ్‌ పరిస్థితులు, గల్వాన్‌ ఘర్షణల పరిణామాల నేపథ్యంలో నిలిచిపోయాయి. నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కొంతకాలంగా ఇరుదేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఈ సేవలను పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలోనే తొలి విమానం నేడు చైనాకు టేకాఫ్‌ తీసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story