శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల కలకలం.. ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సుపై..

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల కలకలం.. ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సుపై..
x
Highlights

అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ దుండగుడు ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు కాన్వాయ్‌పై విచక్షణారహితంగా...

అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ దుండగుడు ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఉదయం 7గంటల నుండి దేశవ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రంగంలో 35 మంది ఉన్నా ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే ఉంది. గొటబాయ రాజపక్స, సాజిత్‌ ప్రేమదాస, అనూర దిస్సననాయకేల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.

Keywords : Sri Lanka, Gun Fire, Voters

Show Full Article
Print Article
More On
Next Story
More Stories