India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

Dhivi
Published on: 24 April 2025 9:09 AM IST
India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు
X

India-Pakistan: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న దాయాది పాకిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ కు బుధవారం అర్థరాత్రి తర్వాత ఈ సమన్లు పంపించింది. ఆయనను పిలిచి..పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా ( అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే) అధికారిక నోటీస్ అందించింది. దీని ప్రకారం వారంతా వారం రోజుల్లోగా భారత్ ను వీడాల్సి ఉంటుందని విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.

కాగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశంలో ఐదు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది దౌత్యపరమైన చర్యతో ప్రారంభమైంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయడం అతిపెద్ద నిర్ణయం. పాకిస్తానీలకు వీసా లభించదు. అలాగే, భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పోస్ట్ చేసిన అవాంఛిత సైనిక అధికారులు ఇప్పుడు వెంటనే భారతదేశం విడిచి వెళ్ళవలసి ఉంటుంది.

భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడటమే కాకుండా, పాకిస్తానీయులకు ఇకపై భారతదేశంలోకి ప్రవేశం ఉండదు. మోడీ ప్రభుత్వ ఈ నిర్ణయాలు పాకిస్తాన్‌కు ఆర్థికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా కూడా నష్టం కలిగిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే, భారతదేశం అతని అన్ని సంబంధాలను తెంచుకుంది.

Dhivi

Dhivi

Next Story