పాకిస్థాన్ లో విజృంభణ.. 24 గంటల్లో అన్ని కేసులా..

పాకిస్థాన్ లో విజృంభణ.. 24 గంటల్లో అన్ని కేసులా..
x
Highlights

పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లో నుంచి వేలల్లోకి పెరిగింది.. గడిచిన 24 గంటల్లో 1,637 మందికి కరోనావైరస్ నిర్ధారణ అయింది.

పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లో నుంచి వేలల్లోకి పెరిగింది.. గడిచిన 24 గంటల్లో 1,637 మందికి కరోనావైరస్ నిర్ధారణ అయింది.దాంతో పాకిస్థాన్ లోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,474 కు చేరినట్లు జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన వారి సంఖ్య 618 కు పెరిగింది.. కొత్తగా మరో 24 మంది రోగులు మరణించారు.

ఇప్పటివరకూ పంజాబ్ ప్రావిన్స్‌లో 10,471, సింధ్ ప్రావిన్స్‌లో 9,691, ఖైబర్-పఖ్తున్ఖ్వా 4,327, బలూచిస్తాన్ 1,876, ఇస్లామాబాద్ 609, గిల్గిట్-బాల్టిస్తాన్ 421, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ 79 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,756 మంది రోగులు కోలుకున్నారు. ఇక టెస్టుల విషయానికొస్తే.. గత 24 గంటల్లో 12,982 మందికి చేయడంతో పాకిస్థాన్ లో మొత్తం 270,025 పరీక్షలను అధికారులు నిర్వహించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories