coronavirus : కోలుకున్న 2 లక్షల మంది రోగులు..

coronavirus : కోలుకున్న 2 లక్షల మంది రోగులు..
x
Highlights

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మరింతగా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల 35 వేల మంది దాకా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మరింతగా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల 35 వేల మంది దాకా వైరస్ మహమ్మారి భారిన పడ్డారు.అలాగే 47 వేల మందికి పైగా మరణించారని దాదాపు 2 లక్షల మంది కోలుకున్నారని వరల్డ్ మీటర్ వెబ్ సైట్ వెల్లడించింది. ఇక UK లో కరోనావైరస్ మరణాల సంఖ్య 24 గంటల్లో 563 కు పెరిగింది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆసుపత్రిలో మరణించిన రోగుల సంఖ్య 2,352 కు చేరుకుంది.

అలాగే స్పెయిన్ అత్యధిక రోజువారీ మరణాలసంఖ్య ను నమోదు చేసింది - మరో 864 మందికి అంటువ్యాధులు సోకడంతో కేసుల సంఖ్య 94,417 నుండి 102,136 కు పెరిగాయి. యునైటెడ్ స్టేట్స్ లో , మరణాల సంఖ్య 4,000 దాటింది మరియు ధృవీకరించబడిన కేసుల సంఖ్య 200,000 దాటింది.

ఇరాన్ మరణాల సంఖ్య 138 కొత్త మరణాలతో 3,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా, 44,000 మందికి పైగా మరణించారని సుమారు 900,000 మంది వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు మరియు 190,000 మంది కోలుకున్నారు అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సేకరించిన సమాచారం వెల్లడించింది. దీంతో ఐక్యరాజ్యసమితి చీఫ్ ఈ మహమ్మారి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని ఎదుర్కొనే "చెత్త సంక్షోభం" గా కరోనా వైరస్ ను అభివర్ణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories