మహమ్మారిపై పాక్ అలసత్వం.. మూల్యం చెల్లించుకుంటోంది..

మహమ్మారిపై పాక్ అలసత్వం.. మూల్యం చెల్లించుకుంటోంది..
x
Highlights

కోవిడ్ -19 మహమ్మారిపై ఆలస్యంగా స్పందించినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది,

కోవిడ్ -19 మహమ్మారిపై ఆలస్యంగా స్పందించినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది, స్క్రీనింగ్ మరియు నిర్బంధంలో వైఫల్యాల కారణంగా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతోంది. పాకిస్తాన్‌లో ప్రస్తుతం 2,400 కు పైగా కేసులు నమోదయ్యాయి మరియు కోవిడ్ -19 దేశవ్యాప్తంగా 34 మరణాలకు కారణమైంది.

ప్రారంభ కేసులలో చాలావరకు షియా యాత్రికులు ఇరాన్ నుండి తిరిగి వచ్చారు, మహమ్మారి బారిన పడిన దేశాలలో ఇరాన్ కూడా ఒకటి, విదేశాల నుంచి వచ్చిన వందలాది మందిని బలూచిస్తాన్ సరిహద్దులోని శిబిరాల్లో ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా పంపించడంతో వైరస్ వేగంగా వ్యాపించింది. పేరుకు కరోనా శిబిరాలు ఏర్పాటు చేసినా అక్కడ కనీసం వైద్య సదుపాయాలు లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

పాకిస్తాన్ ప్రభుత్వం కరోనా అలర్ట్ ప్రకటించినా కూడా అధికారులు మసీదులను మూసివేయడానికి సమర్థవంతమైన చర్య తీసుకోలేదు, మార్చి 20 మరియు మార్చి 27 న శుక్రవారం ప్రార్థనలలో వేలాది మంది చేరారు. దీంతో దేశంలోని మసీదు వ్యాఖ్యాతలు ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.

మార్చి ప్రారంభంలో, పాకిస్తాన్ మరియు విదేశాల నుండి 250,000 మంది లాబ్‌హోర్ సమీపంలోని రాయివిండ్‌లో వద్ద ఐదు రోజుల తబ్లిఘి జమాత్ సమావేశానికి హాజరయ్యారు, దీంతో వందలాది మంది కరోనా భారిన పడ్డారు. అప్పటికే పాక్ లో కోవిడ్ -19 కేసులను ధృవీకరించినట్లు నివేదించినా ఈ సభకు అధికారులు అనుమతి ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది.

సమావేశం ప్రారంభమైన మరుసటి రోజు తబ్లిఘి జమాత్ సభ్యులను చెదరగొట్టమని ప్రభుత్వం కోరింది, కాని అధికారులు నిర్లక్ష్యం వహించారు. దాంతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. వందలాది మంది కోవిడ్ భారిన పడ్డారు.. వీరిలో పాలస్తీనా మరియు కిర్గిజ్స్తాన్ వంటి దూర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. రాయివిండ్‌లో జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సహా 550 మంది జమాత్ సభ్యులను సింధ్‌లో నిర్బంధించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories