కరోనావైరస్ పేరు మార్పు.. ఇకనుంచి..

కరోనావైరస్ పేరు మార్పు.. ఇకనుంచి..
x
Highlights

చైనాలో 1,000 మందికి పైగా మరణం మరియు ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యేందుకు కారణమైన కరోనావైరస్ ను 'covid -19' గా మార్చేసింది...

చైనాలో 1,000 మందికి పైగా మరణం మరియు ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యేందుకు కారణమైన కరోనావైరస్ ను 'covid -19' గా మార్చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది. "మేము భౌగోళిక స్థానం, ఒక జంతువు, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని సూచించని పేరును పెట్టాలని అనుకున్నాం, ఈ పేరు ఉచ్చరించదగినది మరియు వ్యాధికి సంబంధించినది" అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అధికారికంగా పేర్కొన్నారు మంగళవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో చైనా మీడియా చెప్పినట్లు.. CO అంటే కరోనా, VI కోసం వైరస్ మరియు D డిసీజ్ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జెనీవాలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు.

చైనాలో మరణాల సంఖ్య 2002-2003లో సార్స్ మహమ్మారిని అధిగమించిందని.. మంగళవారం వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,017 కు పెరిగాయని.. ఈ ఒక్క సోమవారం, హుబీ ప్రావిన్స్‌లో 103 మంది మరణించారు, ఇది రోజువారీ అతిపెద్ద రికార్డు అని.. అలాగే దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 42,708 కు పెరిగాయని చైనా ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. అలాగే విదేశాలలో ధృవీకరించబడిన కేసులు 390 వరకు పెరిగాయి.

ఇదిలావుంటే జాతీయంగా కొత్త అంటువ్యాధుల సంఖ్య 20% తగ్గింది, అంటే రోజుకు 3,062 నుండి 2,478 కు తగ్గిందని చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ముందస్తు హెచ్చరికలను చేసిన వైద్యుడి మరణం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ వైద్యుడు హెచ్చరించినా వినకుండా అతనిపైనే చర్యలు తీసుకున్న అధికారులను ప్రభుత్వం తొలగించింది. వారిలో హుబీ హెల్త్ కమిషన్ చైర్మన్, అలాగే కార్యదర్శి ఉన్నారు. వారు ఈ కమిషన్ లో సీనియర్ అధికారులుగా ఉన్నారు. డాక్టర్ లి చికిత్సపై పోలీసులు దర్యాప్తు చెంసేందుకు వీలుగా చైనా కేంద్ర ప్రభుత్వం తన అత్యున్నత అవినీతి నిరోధక సంస్థలోని ఒక బృందాన్ని హుబేకి పంపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories