Coronavirus: 19 వేల మరణాలతో అగ్రస్థానంలో ఇటలీ

Coronavirus: 19 వేల మరణాలతో అగ్రస్థానంలో ఇటలీ
x
Representational Image
Highlights

19 వేల కరోనావైరస్ మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉంది.

19 వేల కరోనావైరస్ మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య , ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న వారు క్రమంగా జనరల్ వార్డుకు వెళుతున్నప్పటికీ ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

ఇటలీలో శనివారం నాటికి మరణాల సంఖ్య 619కి పెరిగి మొత్తం 19,468 కు చేరుకోగా, వైరస్‌కు పాజిటివ్ గా పరీక్షించిన వారి సంఖ్య 152,271 కు చేరుకుంది, కొత్తగా 4,694 కేసులతో 3.1 శాతం పెరుగుదల కనిపించింది. అయితే గతంతో పోల్చుకుంటే మరణాల వేగం తగ్గింది. అంతేకాదు కేసులలో కూడా కొంత మందగమనం ఉంది.

కొత్త కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించడంతో.. ఈస్టర్ సెలవులకు చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు లేదా సముద్ర తీరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు.. అయితే వీరిని అధికారులు అడ్డుకుంటున్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న లోంబార్డిలో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇక్కడ కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories