పాకిస్తాన్ మాజీ ప్రధానిపై అత్యాచారం ఆరోపణలు

పాకిస్తాన్ మాజీ ప్రధానిపై అత్యాచారం ఆరోపణలు
x
Highlights

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న సింథియా డి రిట్చీ అనే అమెరికన్ బ్లాగర్.. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న సింథియా డి రిట్చీ అనే అమెరికన్ బ్లాగర్.. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.అలాగే మాజీ ప్రధాని యూసుఫ్ రాజా గిలానీ కూడా శారీరక హింసకు పాల్పడినట్లు రిచీ ఆరోపించారు. ఆ సమయంలో మత్తు పదార్థాలను కలిపిన పానీయం ఇచ్చారని దాంతో తాను మత్తులో ఉన్నానని పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించి శుక్రవారం ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో రెహమాన్ మాలిక్ , గిలానీపై ఆరోపణలు చేసింది.

2011 లో ఆమె రాష్ట్రపతి భవన్ లో నివసించినప్పుడు ఈ సంఘటన జరిగిందని అన్నారు. ఈ సమయంలో బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అధికారంలో ఉంది. ప్రస్తుతం, ఆ పార్టీకి బెనజీర్ కుమారుడు బిలవర్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు రిచీ ఇప్పుడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క సోషల్ మీడియా బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories